‘టిల్లు స్క్వేర్‌’ విడుదల మరింత ఆలస్యం!

‘డీజే టిల్లు’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీ సీక్వెన్స్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఈ సెకండ్‌ పార్ట్‌ లో అనుపమ హీరోయిన్‌ కావడంతో మరింత హైప్‌ పెరిగింది. ఇటీవల కొన్ని పాటలు విడుదల చేయగా, అవి చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెరిగాయి. కానీ, ఈ మూవీ మాత్రం విడుదల ఆలస్యమౌతూ వచ్చింది.

ఇప్పటికే ఈ మూవీని చాలా సార్లు విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు. ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్‌ లో విడుదల పక్కా అనుకున్నా ఈసారి కూడా వాయిదా పడింది. మూవీ టీమ్‌ విడుదల విషయంలో తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ఆలస్యమైనా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వారు చెప్పడం విశేషం.

అయితే, ఈ మూవీ వాయిదా పడింది అనే విషయం దాదాపు అందరికీ తెలిసిపోయింది. సెప్టెంబర్‌ 15న మూవీ అంటే, ఈ పాటికి ప్రమోషన్స్‌ హీట్‌ పెంచేవారు, కనీసం ట్రైలర్‌ అయినా విడుదల చేయాల్సి ఉంది. కానీ, అది కూడా చేయలేదు. దానిని పట్టే ఈ మూవీ ఇప్పుడు రావడం లేదనే విషయంలో క్లారిటీ వచ్చింది.

ఆ తేదీన ఇప్పటికే స్కంద, చంద్రముఖి 2, మార్క్‌ ఆంటోనీ లు విడుదలవ్వడానికి రెడీ అయ్యాయి. అంతేకాదు, ఈ మూవీ లు ఇప్పటికే ట్రైలర్లు కూడా విడుదల చేశారు. ప్రమోషన్స్‌ కూడా హీట్‌ పెంచేశాయి. అవి జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. ‘టిల్లు స్క్వేర్‌’ రావడం లేదు అనే విషయం అందరికీ అర్థమయ్యాక, ఇప్పుడు ఆలస్యంగా సారీ అంటూ చెప్పడం ఏంటి టిల్లూ బ్రో అనే కామెంట్స్‌ వినపడుతున్నాయి.

ఇక, మొదటి భాగం లో సిద్దు జొన్నల గడ్డ చెప్పిన డైలాగుల తో పాటు, నేహా శెట్టి అందాలు సినిమాకి హైలెట్‌ గా నిలిచాయి. మూవీ విజయం సాధించడానికే ఇవే కారణం. మరి రెండో భాగంలో ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.