శివరాజ్ కుమార్ హీరోగా సప్త సాగరాలు దాటి డైరెక్టర్ హేమంత్ ఎం రావ్ సినిమా !!!

“సప్త సాగరాలు దాటి” సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు హేమంత్ ఎం రావు, 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా న‌టించింది. ఇక ఈ సినిమా అనంత‌రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు .

కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న‌ట్లు స‌మాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గోధి బన్న సాధారణ మైకట్టు కవలుదారి, భీమ సేన నల మహారాజు, సప్త సాగరాలు దాటి లాంటి డిఫరెంట్ జాన‌ర్‌లు త‌ర్వాత హేమంత్ ఎం రావు యాక్ష‌న్ సినిమా చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

వైశాక్ ఏ గౌడ “తాను నిర్మిస్తున్న మొదటి సినిమానే శివరాజ్ కుమార్ లాంటి స్టార్ట్ తో చేయడం సంతోషంగా ఉందని. ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచిందని తెలియజేశారు”.