సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, ప్రొడక్షన్ నెం 30 టైటిల్ ‘తెలుసు కదా’

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈరోజు తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ చిత్రం కానుంది. భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

ఈ చిత్రానికి ‘తెలుసు కదా’ అని పేరు పెట్టారు. ఈ చిత్రం పూర్తి విందు భోజనం అందించబోతుందని అనౌన్స్ మెంట్ వీడియో సూచిస్తోంది. విజువల్స్ గ్రాండ్‌గా వున్నాయి, టాప్ క్లాస్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో అనౌన్స్ మెంట్ కాన్సప్ట్ యూనిక్ గా వుంది.

సోల్‌ఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా సిద్దుని కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేస్తుంది. ఇందులో అందమైన భావోద్వేగాలతో పాటు సోషల్ ఎలిమెంట్స్, రిలేషన్స్ వుంటాయి. ఒక అబ్బాయి, అమ్మాయి కథతో పాటు స్నేహం, కుటుంబం, త్యాగం, సెల్ఫ్ లవ్ కి సంబధించిన కథ ఇది.

ఈ సినిమాలో రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ డీవోపీ యువరాజ్ జె ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అర్చనరావు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.

‘తెలుసు కదా’ రిఫ్రెష్ కథాంశంతో, టాప్ క్లాస్ సాంకేతిక ప్రమాణాలతో సినీ అభిమానుల మనసులని గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

మరికొద్ది వారాల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి

రచయిత, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: యువరాజ్ జె
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు
పీఆర్వో: వంశీ-శేఖర్