రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ రోరింగ్ ట్రైలర్ విడుదల

మరో 17 రోజుల్లో టైగర్స్ హంట్ ప్రారంభమవుతుంది. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో, యంగ్ ట్యాలెంటెడ్ వంశీ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ లు ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాపులర్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా సినిమాలోని ప్రముఖ పాత్రలందరినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసిన మేకర్స్, మోస్ట్ వాంటెడ్ దొంగలకు స్థావరంగా ఉన్న స్టువర్ట్‌పురం వరల్డ్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రోరింగ్ ట్రైలర్‌తో వచ్చారు. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.

నాగేశ్వరరావు రాకతో రాబరీ పద్దతులు మారిపోయాయి. అతనికి అధికారం దాహం, స్త్రీలపై కాంక్ష, డబ్బు కోసం వ్యామోహం ఉంది. ఎవరినైనా కొట్టడానికి, ఏదైనా దోచుకోవడానికి ముందు హెచ్చరికలు చేయడం కూడా అతనికి అలవాటు. అయితే, నాగేశ్వరరావును ఎలిమినేట్ చేయడానికి ఒక బ్యాడ్ పోలీసు వస్తాడు. స్టూవర్టుపురం నాగేశ్వరరావు కథ అతని అరెస్టుతో ముగిసింది, అయితే టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడి నుండి ప్రారంభమవుతుంది. నేషనల్ థ్రెట్ గా మారిన టైగర్ నాగేశ్వరరావు నెత్తుటి వేట సాగుతుంది.

రెండున్నర నిమిషాల ట్రైలర్ లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్, బ్రూటల్ గా కనిపించారు. మాసీ రోల్ లో రవితేజ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. ప్రతి నటుడికీ నటించడానికి ఒక స్పేస్, స్కోప్ వుంది. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్ గా కనిపించారు, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్‌గుప్తా, హరీష్ పెరడి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.

టైగర్ నాగేశ్వరరావు యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. దర్శకుడు వంశీ కథ ని చూపించిన విధానం యునిక్ గా వుంది. రవితేజ స్టార్ చరిష్మాకు తగినట్లుగా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్. యాక్షన్ కొరియోగ్రఫీ వరల్డ్ క్లాస్. ఆర్ మదీ తీసిన విజువల్స్ గ్రాండ్, టెర్రిఫిక్ గా ఉన్నాయి, జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ సినిమా పై అంచనాలని మరింత పెంచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ మహారాజ రవితేజ మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వరరావు తో హిందీలోకి రావడం ఆనందంగా వుంది. హిందీకి నేనే డబ్బింగ్ చెప్పాను. టైగర్ నాగేశ్వరరావు తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు

అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేశాం. అభిషేక్ గ్రేట్ ప్రొడ్యుసర్. ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. ఆయన పాజిటివిటీ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడు వంశీ జీవితం మారుతుంది. ఈ సినిమాలో అందరితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఇప్పుడు సౌత్ నార్త్ సినిమా అనే తేడా లేదు. ఇప్పుడంతా ఇండియన్ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది ” అన్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. రవితేజ గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. మాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. దర్శకుడు వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అనుపమ్ ఖేర్ గారు మా ఫ్యామిలీ మెంబర్ లానే వుంటారు. చాలా ప్యాషన్ తో ఈ సినిమాని తీశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. రవితేజ గారు ఈ కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోగానో సపోర్ట్ చేశారు. ప్రతి అడుగులో నాకు అండగా నిలబడ్డారు. ఆయకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. రవితేజ గారు ఫిల్మ్ లవర్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన వలనే ఈ సినిమా సాధ్యపడింది. దాదాపు 500 పైగా చిత్రాలు చేసిన అనుపమ్ గారితో ఈ సినిమాలో పని చేయడం ఆనందంగా వుంది. అలాగే నుపూర్, గాయత్రి, రేణు దేశాయ్ గారు చాలా మంచి నటీనటులతో ఈ చిత్రాన్ని చేశాం. అభిషేక్ గారు చాలా గ్రాండ్ గా ఈ సినిమా తీశారు . టైగర్ నాగేశ్వరరావు చాలా ప్రత్యేకమైన సినిమా. అందరినీ అలరిస్తుంది” అన్నారు.

గాయత్రి మాట్లాడుతూ.. దర్శకుడు వంశీ గారు దాదాపు ఐదేళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అద్భుతమైన కథని రాసి అత్యద్భుతంగా చిత్రీకరించారు. అభిషేక్ గారు ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ లో నిర్మించారు రవితేజ గారు లాంటి మాసీవ్ స్టార్ తో సినిమా చేయడం ఆనందంగా వుంది” అన్నారు

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. వంశీ ఈ కథ చెప్పినప్పుడే .. చాలా పెద్ద దర్శకుడౌతారని చెప్పాను. ఈ కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పాను. అభిషేక్ గారు చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించారు” అన్నారు.

జిషు సేన్ గుప్తా గుప్తా మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నేను చాలా మంది స్టార్స్ తో కలిసి పని చేశాను. రవితేజ గారితో కలసి పని చేయడం ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. రవితేజ గారిని మాస్ మహారాజా అని ఎందుకు అంటారో ఆయన్ని కలసిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత తెలిసింది. రవితేజ గారు గ్రేట్ పర్శన్’ అన్నారు. ఈ ఈవెంట్లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్