రవితేజ, గోపీచంద్ మలినేని, #RT4GM అనౌన్స్ మెంట్

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాల్నిపూర్తి చేశారు. ఇప్పుడీ బ్లాక్ బ్లాక్ బస్టర్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్‌ ని టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తోంది. ఈరోజు #RT4GM సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు.

#RT4GM కోసం యూనిక్ అండ్ పవర్ ఫుల్ కథను రాశారు గోపీచంద్ మలినేని. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో భయానక స్థితిలో వున్న ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. టెర్రిఫిక్ గా వున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

మిగిలిన వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: రవితేజ

సాంకేతిక విభాగం
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: ఎస్ థమన్
పీఆర్వో : వంశీ శేఖర్