ధనుష్, #D51 లో హీరోయిన్ గా రష్మిక మందన్న

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తన 51వ సినిమా కోసం టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ , నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేతులు కలిపారు. ఇటివలే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ #D51ని తమ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ )లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలసి నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పితో రష్మిక మందనకు ఇదే ఫస్ట్ అసోషియేషన్.

ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకుంటూ.. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను’’ అని #D51 ఫోటో ఫ్రేం ని ప్రజంట్ చేశారు.

అసాధారణమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్ సబ్జెక్ట్ రాసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ తారాగణం భాగం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: ధనుష్, రష్మిక మందన్న

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో