షూటింగ్ పూర్తి చేసుకున్న పింకీ ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో విడుద‌ల‌!!

విఆర్ పి క్రియేష‌న్స్ ప‌తాకంపై పి.ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్‌, మౌర్యాణి జంట‌గా సుమ‌న్ , శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి అట్లూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం పింకీ. సీర‌పు ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్ గా విడ‌దుల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ‌, సాయి వెంక‌ట్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ..జ‌నం, జ‌రిగిన క‌థ చిత్రాలు చేసిన ద‌ర్శ‌క నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ గారు. ఆయ‌న ద‌ర్శ‌కుడు అయ్యుండి మ‌రో ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వ‌డం గొప్ప విష‌యం. త‌న నిర్మాణంలో వ‌స్తోన్న ఈ పింకీ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

మ‌రో అతిథి సాయి వెంక‌ట్ మాట్లాడుతూ..ఈ మ‌ధ్యే వెంక‌ట ర‌మ‌ణ గారు జ‌నం అనే సినిమాతో విజ‌యం సాధించారు. ఆయ‌న ద‌ర్శ‌కుడు అయినా కూడా మ‌రో ద‌ర్శ‌కుణ్ని ఎంక‌రేజ్ చేస్తూ పింకీ సినిమా చేయ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. సుమ‌న్ గారు విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు పోస్ట‌ర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రం టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు అన్నారు.

న‌టుడు ర‌వి అట్లూరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సీనియ‌ర్ ఆర్టిస్ట్ చేయాల్సిన పాత్ర ఇచ్చిన‌న్ను ప్రోత్స‌హించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు` అన్నారు.

హీరో కిర‌ణ్ మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో హీరోగా అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు. దర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు సినిమా. ఈ సినిమా విడుద‌ల‌కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నా అన్నారు.

ద‌ర్శ‌కుడు సీర‌పు ర‌వి కుమార్ మాట్లాడుతూ…ఇది నా మొద‌టి సినిమా. నిర్మాత ఎక్క‌డా రాజీ పడ‌కుండా సినిమా బాగా రావ‌డానికి స‌హ‌క‌రించారు. ఒక డైమండ్ కోసం జ‌రిగే అన్వేష‌ణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అన్నారు.

నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ మాట్లాడుతూ.. 1980 లోమ‌ద్రాసు వెళ్లి అక్క‌డ ప్ర‌ముఖుల‌తో ప‌ని చేశాను. ఆ త‌ర్వాత జ‌రిగిన క‌థ‌, జ‌నం చిత్రాలు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాను. వాటికి మంచి పేరొచ్చింది. ఆద‌ర్శ భావాల‌తో ఆ రెండు చిత్రాలు చేశాను. ప్ర‌జంట్ జ‌నం పార్ట్ 2 షూటింగ్ లో ఉంది. సీర‌పు ర‌వి కుమార్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో `పింకీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ద‌ర్శ‌కుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు` అన్నారు.

ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ…“ పింకీ టైటిల్ తో వివిధ భాషల్లోవ‌చ్చిన చిత్రాలన్నీ ఘ‌న విజ‌యం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్ తో వ‌స్తోన్న ఈ చిత్రం కూడా మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా. వెంక‌ట ర‌మ‌ణ గారు వ‌రుస‌గా చిత్రాలు చేస్తూ..ఓ కొత్త ద‌ర్శ‌కుడి అవ‌కాశం క‌ల్పిస్తూ ఈ సినిమా చేయ‌డం మెచ్చుకోవాల్సిన విష‌యం. కొత్త వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తూ చేసే చిత్రాల‌ను ఆద‌రిస్తే ఇంకా ఎంతో మందికి అవ‌కాశాలు వ‌స్తాయి. ర‌వికుమార్ ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం చేసిన‌ట్లు పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.

కిర‌ణ్‌, మౌర్యాణి, సుమ‌న్, శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి త‌దిత‌రులు న‌టిస్తోన్న.

ఈ చిత్రానికి డీఓపిః అమ‌ర్

ఎడిటింగ్ః నాని కారుమంచి

సంగీతంః చిన్నా( చెన్న‌య్)

పీఆర్ ఓః బాక్సాఫీస్ రమేష్‌

కో-ప్రొడ్యూస‌ర్ః ఎమ్ బి (మ‌ల్లిబాబు), డా.సాయిమ‌ల్లి అరుణ్ రామ్

నిర్మాతః ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ‌

స్టోరి-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ః డైర‌క్ష‌న్ః సీర‌పు ర‌వికుమార్.