‘ఆపరేషన్ వాలెంటైన్’ విజువల్ ఫీస్ట్ లా వుంటుంది: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎవరి ఈవెంట్ జరిగినా తమ ఇంట్లో వేడుకలా ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు వచ్చి మమ్మల్ని ఉత్సాహపరిచే మా అభిమానులు శిరస్సువంచి నమస్కారిస్తున్నాను. నేను కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు ‘నీతో మాట్లాడాలి డాడీ’ అంటూ వరుణ్ తేజ్ నుంచి మెసేజ్ వచ్చింది. వరుణ్‌ సాధారణంగా నాకు మెసేజ్‌లు పెట్టడు.. నేరుగా మాట్లాడతాడు. ఏమైందో అనుకున్నా. హైదరాబాద్‌ తిరిగొచ్చాక ఈ సినిమా, ఈవెంట్‌ గురించి చెప్పాడు. రియల్‌ హీరోలపై తీసిన చిత్రం గురించి మీరు చెబితే రీచ్‌ వేరేలా ఉంటుందన్నాడు. సరహద్దుల్లో ఉంటూ మనల్ని కాపాడే వారియర్స్‌ గురించి చెప్పడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ వేడుకకు రావడం గర్వంగా ఉంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు.అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు హృదయవిదారకరంగా ఉంటుంది. ఆ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించేలా.. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన భారత వైమానిక దళం చేసిన సాహసోపేతమైన యుద్ధమే ఈ సినిమా. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది కాబట్టి సినిమా పరంగా పెట్టిన పేరు ‘ఆపరేషన్ వాలెంటైన్’అని వరుణ్ చెప్పినప్పుడు చాలా సెన్సిబుల్ గా వుందనిపించింది. తెలుగులో అవకాశాలు వుంటాయి, మంచి పారితోషికం ఉంటుందని, కమర్షియల్‌ డైరెక్టర్‌గా స్థిరపడిపోవచ్చనే ఉద్దేశంతో దర్శకుడు శక్తి ప్రతాప్‌ ఇక్కడకు రాలేదు. తన సొంత ఖర్చుతో దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసి సర్జికల్‌ స్ట్రైక్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈసారి సినిమా తీస్తే మరింత సమాచారం మేమిస్తామని అధికారులు ఆయన్ను ప్రోత్సాహించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కంటెంట్ ని అద్భుతంగా తీశాడు. సిద్దు, సోనీ పిక్చర్స్ కలసి చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. సినిమా అద్భుతంగా వచ్చిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి సినిమాలు ఆడాలి. ముఖ్యంగా యూత్ చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. రియల్ హీరోస్ కి ఒక సెల్యూట్ గా ఈ సినిమా మనమందరం చూసి తీరాలి. ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. రిజనబుల్ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్‌, రిచ్ నెస్ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే దర్శకుడు శక్తి సక్సెస్‌ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నవదీప్‌ మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. రామ్‌ చరణ్‌ ‘ధ్రువ’ సినిమాలోని తన నటన నాకు ఇష్టం. ఇందులోనూ మంచి పాత్ర పోషించాడు. అభినవ్‌ ట్యాలెంటెడ్. సోషల్‌ మీడియాలో కనిపించే మీమ్స్‌లో తనే ఎక్కువగా కనిపిస్తాడు. చరణ్‌, వరుణ్‌.. ఇలా వీరంతా నన్ను చూస్తూ వేరే రంగంలోకి వెళ్లలేకపోయారని భావిస్తాను. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగారు. ఈ విషయంలో నేను అందరినీ ప్రోత్సహిస్తా. ఎందుకంటే చిత్ర పరిశ్రమను నేను గౌరవిస్తా. మనం ఎంతగా గౌరవిస్తే అంతగా మనల్ని అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మా. అలాంటి ఇండస్ట్రీలోకి నా బిడ్డలొచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముంది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చారమో కానీ నటుడిగా వరుణ్‌ నన్ను ఎప్పుడూ ఫాలోకాలేదు. ముందు నుంచీ విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని ఇలాంటి అవకాశాలు వరుణ్‌కు వచ్చాయి. తను అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ముకుంద, కంచె, గద్దలకొండ గణేష్, ఫిదా, తొలిప్రేమ ఇవన్నీ దేనికవే భిన్నమైన చిత్రాలు. అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు. ఎయిర్‌ ఫోర్స్‌పై టాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. ఈ చిత్రం ప్రేక్షకులకు కన్నుల పండగలా వుంటుంది. గతేడాది హాలీవుడ్‌ సినిమా ‘టాప్‌గన్‌’లోని విజువల్స్‌ చూసి ఇలాంటిది మనం తీయగలమా? అనుకున్నా. ఇప్పుడు మన వాళ్ళు వరుణ్, సిద్దు, శక్తి వీరంతా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అదే స్థాయిలో తీశారు. టాలెంట్‌ ఒకరి సొత్తు కాదు. మనం కూడా ఆ స్థాయిలో వున్నాం. సినిమాలో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా బెస్ట్ విషెష్. ఈ సినిమా గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్. మార్చి 1న థియేటర్లలో చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమాని విజయవంతం చేసి మన సైనికులకు సెల్యూట్‌ చేయాల్సిన బాధ్యత అందరిపై వుంది. జై హింద్” అన్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘మా పెద్దనాన్న నాకు స్ఫూర్తి. ఆయన మా సినిమా టీమ్‌ని విష్‌ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెబుతుంటారు పెద్దనాన్న. ఇంతమంది అభిమానుల్ని మాకు ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్‌ కృతజ్ఞతలు. అభిమానులు ప్రోత్సాహానికి ప్రేమకి రుణపడి ఉంటాడు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతోనే నేనెప్పుడూ కష్టపడుతుంటాను. ఈ చిత్రాన్ని శక్తిప్రతాప్‌ ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో మన దేశ వైమానిక దళ వీరుల త్యాగాల్ని, గొప్పతనాన్ని చాటేలా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి ధన్యవాదాలు. మిక్కీ జే మేయర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఫైటర్ విజయ్ మాస్టర్, ఎడిటర్ నవీన్ నూలీ, డీవోపీ హరి అందరూ అద్భుతంగా పని చేశారు. నిర్మాతలు సిద్దు, సోనీ పిక్చర్స్ కి ఆల్ ది బెస్ట్. మన కోసం ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని రక్షించే సైనికుల మీద సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. ఈ సినిమా చూసి ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వాడు గుండెలపై చేయి వేసుకొని మన జవాన్లకు సెల్యూట్‌ కొడతారు. అలా ఉండనుంది ఈ సినిమా. మార్చి 1 తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడాలి’’ అని కోరారు.

నిర్మాత సందీప్ ముద్దా మాట్లాడుతూ.. మమ్మల్ని బ్లెస్ చేసిన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. నేను చిరంజీవి అభిమానిని. చిన్నప్పటి నుంచి ఇదే నా ఐడెంటిటీ. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అమ్మ నాన్న చిరంజీవి. నాకు తెలిసిందే ఇదే. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను. వరుణ్ నా సోల్ మేట్. ఈ సినిమా కోసం ఆయన చేసిన సపోర్ట్ మర్చిప్పోలేను. మన వీర సైనికులకు నివాళిగా ఈ సినిమాని అద్భుతంగా నిర్మించాం. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.

చిత్ర దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ..చిరంజీవి గారు ఈ వేడుకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం గౌరవంగా వుంద. ఇది చాలా బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు నేనెప్పుడూ వరుణ్‌ తేజ్‌ను చూడలేదు. యువ వయసులో ఉన్న చిరంజీవి, నాగబాబును తనలో చూశాను. ఈ సినిమాకి తను మెయిన్ పిల్లర్. సినీ పిక్చర్స్ కి ధన్యవాలు. సమష్టి కృషికి ఫలితం ఈ చిత్రం. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదలు. ఈ సినిమాలో యాక్షన్‌, ఎమోషన్‌, డ్రామా, అడ్వెంచర్‌, దేశభక్తి… ఇలా చాలా అంశాలున్నాయి తప్పకుండా థియేటర్లలో చూడండి.. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

నాగేంద్రబాబు మాట్లాడుతూ..మెగా అభిమానులందరికీ కృతజ్ఞతలు. నా పిల్లలు, అందరి బిడ్డలు బాగుండాలి.. దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు బాగుండాలని మా అమ్మ దైవాన్ని ప్రార్థిస్తుంది. మా అమ్మ వాళ్ల నాన్న, మేనమామ, మా పెద్దనాన్న మిలటరీలో పనిచేశారు. టెక్నాలజీలేని రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో పెద్దనాన్న చెప్పేవారు. యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్‌ వారు ముందుగా ఎటాక్‌ చేస్తుంటారు. 1965 పాకిస్థాన్‌ వార్‌ సమయంలో అత్యాధునిక రాడార్‌ను అమెరికా ఆ దేశానికి అందించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అలీ బ్రదర్స్‌ సాహసోపేతంగా ఆ రాడార్‌ను ధ్వంసం చేశారు. ఆ దెబ్బకి పాక్ ఆర్మీ తేరుకోలేదు.1962 చైనా వార్‌లో మన ఆర్మీ పోరాటం చూసి చైనా ఆర్మీ ప్రశంసించింది. వరుణ్‌ ఎప్పుడూ కొత్తదనంతో నిండిన సినిమాలు చేయాలనుకుంటాడు. రిస్క్‌ తీసుకుంటాడు. కథలు, పాత్రలు ఎంపిక చేసుకునే విధానం నాకు బాగా ఇష్టం. మన ఆర్మీ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని తీయడం చాలా అనందంగా వుంది. అక్టోబర్ ల్ నా పుట్టిన రోజుకి అమ్మ కొంత డబ్బు ఇచ్చింది. దానికి ఇంకొంత కలిపి ఒక ఆరు లక్షల రూపాయిలు ఇండియన్ డిఫెన్స్ వీరనారి వారికి అందిస్తున్నాం. వరుణ్, దర్శకుడు, నిర్మాత వెళ్లి ఆ డబ్బుని అందిస్తారు. జై హింద్” అన్నారు.

డైరెక్టర్ సాగర్ కే చంద్ర మాట్లాడుతూ..చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’.. అప్పటివరకూ ఇండియాకి వున్న ఇమేజ్ ని మార్చిన స్పెషల్ ఆపరేషన్ ఇది. దీనిపై వరుణ్ తేజ్ గారు సినిమా చేయడం చాలా అనందంగా వుంది. వరుణ్ గారి కథల ఎంపిక చాలా వైవిధ్యంగా వుంటుంది. టీం అందరికీ గుడ్ లక్. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది”అన్నారు.

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. జవాన్ లేకపోతే దేశంలో ఎవరూ ఉండలేరు. సరిహద్దులో వుండే సైనికుని త్యాగాల్ని మనం గుర్తించాలి. పుల్వామా లో జరిగిన ఆపరేషన్ ని బేస్ చేసి చాలా అద్భుతంగా ఈ సినిమా చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడాలి’ అని కోరారు. నవదీప్‌, అభిషేక్‌ అగర్వాల్‌, శశి, విజయ్‌, రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.