సాయిపల్లవి బతికిపోయింది…కీర్తి సురేశ్‌ బలైంది: ‘భోళాశంకర్‌’పై నెటిజన్ల విమర్శలు!

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్‌’ సినిమా ప్రేక్షకులను ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా పై యాంటీ మెగా ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ‘వేదాళం’ను ‘భోళా శంకర్‌’గా రీమేక్‌ చేసి తప్పు చేశారని అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం చిరంజీవి ఈ రీమేక్‌ చేయకుండా ఉండాల్సింది కాదనిఅంటున్నారు. రకరకాలుగా ‘భోళా శంకర్‌’ను ట్రోల్‌ చేస్తున్నారు.

తాజాగా సాయిపల్లవి పేరుతో ఈ సినిమాపై ట్రోల్స్‌ చేస్తున్నారు. చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్‌ నటించిన విషయం తెల్సిందే. ఆమె పాత్రకు, నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ పాత్రకోసం మొదట కీర్తి సురేష్‌ను కాకుండా సాయిపల్లవిని సంప్రదించారు. సాయి పల్లవి, చిరంజీవి మధ్య ఈ విషయమై ఒకానొక సమయంలో ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్‌ పై చర్చ కూడా వచ్చింది. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘భోళాశంకర్‌’ లో చిరంజీవి కి చెల్లి పాత్రలో నటించేందుకు సాయి పల్లవి నిరాకరించడం అనేది అందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు అదే విషయమై కొందరు సోషల్‌ విూడియా ద్వారా ట్రోల్స్‌ చేస్తూ ‘భోళా శంకర్‌’ ను విమర్శిస్తున్నారు. ‘భోళా శంకర్‌’లో చిరంజీవి చెల్లెలు పాత్రను సాయి పల్లవి చేయకుండా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఆమె కనుక ‘భోళా శంకర్‌’ ను చేసి ఉంటే కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ అన్నట్లుగా నిలిచేది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సాయి పల్లవి తిరస్కరించి మంచి పని చేసింది. కానీ ‘భోళా శంకర్‌’ లో చెల్లి పాత్ర చేసి కీర్తి సురేష్‌ బలైపోయింది అని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు!!