‘కెప్టెన్‌ మిల్లర్‌’లో నాగ్‌ కీలక భూమిక!

సార్‌తో తెలుగులో యాభై కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టి తిరుగులేని మార్కెట్‌ను పెంచుకున్నాడు ధనుష్‌. ప్రస్తుతం ఆయన సినిమాలకు ఇక్కడ మాములు గిరాకీ లేదు. కెప్టెన్‌ మిల్లర్‌ కోసం ఇప్పటి నుంచే తెలుగు నిర్మాతలు కాచుకొని చూస్తున్నారు. డబ్బింగ్‌ హక్కుల కోసం ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు.

ఇక శేఖర్‌ కమ్ములతో చేయబోయే సినిమాకైతే మాములు ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. ధనుష్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌కు మాములు రెస్పాన్స్‌ రాలేదు. ఓ వైపు ఆకాశ హర్మ్యాలు, మరోవైపు మురికి వాడాలు, వాటి మధ్యలో నోట్ల కట్టలతో పోస్టర్‌ను డిజైన్‌ చేసి సినిమా థీమ్‌ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌ విూదకు వెళ్తుందా అని అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా మేకర్స్‌ మరో బిగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడిరచారు. సినిమా మొత్తం నాగ్‌ చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. ఇక సినిమా నిర్మాతల్లో ఒకరైన ఏషియన్‌ సునీల్‌కు నాగార్జునకు మధ్య ఎప్పటి నుంచో మంచి బాండిరగ్‌ ఉంది. పైగా శేఖర్‌ కమ్ములా సైతం చైతన్యతో లవ్‌స్టోరీ చేశాకా అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. దాంతో ఈ సినిమాలో కీలకపాత్ర చేయడానికి నాగ్‌ మరోమారు ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడట.

ఇక ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. రేపో మాపో సెట్స్‌ విూదకు కూడా వెళ్లనుంది. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు నాగ్‌ తన కొత్త సినిమాను ప్రకటించేశాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బన్నీను దర్శకుడిగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ నా సామిరంగా అనే అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ సినిమా చేస్తున్నాడు.

తాజాగా రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్‌ వస్తుంది. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పలాస దర్శకుడు కరుణ కుమార్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు. సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఇక ఇన్ని రోజులు నాగ్‌ నుంచి సినిమా రావడం లేదంటూ నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు నాగార్జున్‌ డబుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు.