నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ నుంచి పెప్పీ మెలోడీ విడుదల

కింగ్ నాగార్జున అక్కినేని పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ ‘నా సామిరంగ’తో రాబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పండుగకు గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న నాగార్జున, విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మ్యాసీ, రగ్గడ్ అవతార్‌లో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి మ్యాసీవ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఆస్కార్ అవార్డ్- విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి, ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ నాగార్జునకు మరో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించడానికి మరొకసారి కొలబరేట్ అయ్యారు. మేకర్స్ మొదటి సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది పాట విడుదల చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.

ఎంఎం కీరవాణి ప్లజెంట్ వైబ్‌లను కలిగి ఒక మెస్మరైజింగ్ మెలోడీని స్కోర్ చేసారు. రామ్ మిరియాల తన వోకల్స్ తో కట్టిపడేశారు. చంద్రబోస్ మెలోడీ చార్ట్‌బస్టర్‌గా నిలిపే సాహిత్యాన్ని అందించారు. నాగార్జున, ఆషికా రంగనాథ్‌ల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే నాగార్జున తన హ్యాండ్సమ్ లుక్స్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టగా, ఆషికా సాంప్రదాయక గెటప్‌లో ఆకట్టుకుంది. పాటలో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పెప్పీ మెలోడీ చార్ట్-టాపింగ్ హిట్ అవుతుంది.

2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు.

తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, ఆషికా రంగనాథ్, కరుణ కుమార్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
సమర్పణ: పవన్ కుమార్
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సాహిత్యం: చంద్రబోస్
పీఆర్వో: వంశీ-శేఖర్