అజయ్ దేవగణ్ ‘మైదాన్’ ట్రైలర్.. రంజాన్ సందర్భంగా రిలీజ్‌

బయటి ప్రపంచానికి అంతగా తెలియని మన రియల్ హీరో సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్రను చూపించేందుకు ‘మైదాన్’ అనే సినిమా రాబోతోంది. అజయ్ దేవగన్ పోషించిన ఈ పాత్రతో కోచ్‌గా భారతదేశం కోసం ఆయన చేసిన కృషి, చరిత్రలో ఎలాంటి రికార్డులను సృష్టించాడు? అనే కథాంశంతో మైదాన్ రాబోతోంది. ప్రపంచంలో అత్యధికంగా ఆడే క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో మన దేశం విజయాన్ని ఎలా సాధించేలా చేశారో చూపించబోతోన్నారు.

యథార్థ ఘటనల ఆధారంగా ఈ ‘మైదాన్’ సినిమాను ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీందర్నాథ్ శర్మ తెరకెక్కించారు. మైదాన్ చిత్రంలో.. ప్రియమణి, గజరాజ్ రావు, ప్రసిద్ధ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ కూడా నటించారు. మైదాన్ ట్రైలర్‌ను గురువారం నాడు రిలీజ్ చేశారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణాన్ని తెరపై అంతే అద్భుతంగా చూపించారు.

సయ్యద్ అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణం, ఫుట్ బాల్ ఆటను IMAXలో కూడా చూడొచ్చు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను సాయివిన్ క్వాడ్రాస్, రితేష్ షా అందించారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్, సాహిత్యాన్ని మనోజ్ ముంతాషిర్ శుక్లా అందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రంజాన్‌కు థియేటర్లలో విడుదల చేయనున్నారు.