ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక 13 ఏళ్ళ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ ఉంది. దర్శకుడిగా త్రివిక్రమ్ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి స్పీడ్ మీద ఉన్నాడు.
ఇక హీరోగా మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ తర్వాత వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ ట్రాక్ మెయింటేన్ చేస్తున్నాడు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపధ్యంలోనే సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఈ మూవీ బిజినెస్ స్టార్ట్ అయిపొయింది. తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకి అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.
నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఏకంగా 70 కోట్లకి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ ని సరిగమ ఆడియో కంపెనీ 20 కోట్లు చెల్లించి సొంతం చేసుకుందని తెలుస్తుంది. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ ఈ సినిమాతో కూడా త్రివిక్రమ్ అందిస్తాడనే నమ్మకంతో సదరు ఆడియో కంపెనీ ఏకంగా 20 కోట్లు ఈ మూవీ మీద పెట్టినట్లు తెలుస్తుంది.
మొత్తానికి ఇప్పుడు ఈ సినిమా నాన్ థీయాట్రికల్ రైట్స్ రూపంలో 90 కోట్ల బిజినెస్ జరుపుకుందని తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇది కచ్చితంగా అరుదైన రికార్డ్ అని చెప్పాలి. అలాంటి రికార్డ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేట్ చేయడం ఇప్పుడు క్రేజీ న్యూస్ గా మారిపోయింది.
