‘మా ఊరి పొలిమేర‌` సీక్వెల్ షూటింగ్ పూర్తి!!

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా `మా ఊరి పొలిమేర` కు సీక్వెల్ తెర‌కెక్కుతోంది. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, బాలాదిత్య, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

ఈ చిత్రానికి సంగీతంః గ్యాని
సినిమాటోగ్ర‌ఫీః ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి
పీఆర్వోః వంగాల కుమార‌స్వామి
ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఉపేంద్ర రెడ్డి చందా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎన్‌.సి.స‌తీష్ కుమార్
నిర్మాతః గౌరి కృష్ణ‌
స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైర‌క్ష‌న్ః డా.అనిల్ విశ్వ‌నాథ్‌