ఆది పినిశెట్టి ‘శబ్దం’లో కథానాయికగా లక్ష్మి మీనన్

డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘వైశాలి’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం ‘శబ్దం’. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాత.

ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ హీరోయిన్ లక్ష్మి మీనన్ నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన లక్ష్మి మీనన్ ఇంటెన్స్ సీరియస్ లుక్ ఆసక్తికరంగా వుంది. ఇప్పటికే విడుదల ఈ చిత్రంఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది.

ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. అరుణ్ బత్మనాభన్ కెమెరా మెన్ గా పని చేస్తుండగా, స్టార్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాబు జోసెఫ్ ఎడిటర్ గా మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: ఆది పినిశెట్టి, లక్ష్మి మీనన్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం, లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్
నిర్మాత: 7G శివ
బ్యానర్లు: 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్
సహ నిర్మాత: భానుప్రియ శివ
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
డీవోపీ: అరుణ్ బత్మనాభన్
ఎడిటర్: సాబు జోసెఫ్
ఆర్ట్ డైరెక్టర్: మనోజ్ కుమార్
స్టంట్స్: స్టన్నర్ సామ్
స్టిల్స్ : డి. మానేక్ష
మార్కెటింగ్ & ప్రమోషన్: డిఇసి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్ బాలకుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్