9న రానున్న ‘ఖుషీ’ ట్రైలర్‌!

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ’ఖుషి ’. నిన్ను కోరి, మజిలీ, టక్‌ జగదీష్‌ చిత్రాల ఫేమ్‌ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే మేకర్స్‌ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌తోపాటు ’నా రోజా నువ్వే’ ’ఆరాధ్య’ ’ఖుషి’ అంటూ సాగే పాటలకు సోషల్‌విూడియాలో మంచి స్పందన లభిస్తున్నది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని విజయ్‌, సమంత ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చేస్తున్న ట్రైలర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఆగష్టు 9న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు విజయ్‌ దేవరకొండ సోషల్‌ విూడియాలో వెల్లడిరచాడు. ఈ ట్రైలర్‌ 2 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉందంటూ విజయ్‌ ట్విట్టర్‌లో తెలిపాడు. అంతకుముందు ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు సీబీఎఫ్‌సీ ’యూ’ సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు విజయ్‌ తెలిపిన విషయం తెలిసిందే.