కుర్రాళ్ల మతి పోగొడుతున్న కేతిక శర్మ!

టాలీవుడ్ కి కొత్తభామల దిగుమతి ఎప్పుడూ ఉండేదే! అదిరే అందాలతో కిక్కెక్కిస్తోన్న ముద్దుగుమ్మలెందరినో చూసి అదరహో అనాల్సిందే.. అలా వచ్చిన మరో భామ కేతిక శర్మ. చిత్రసీమలో గ్లామర్‌ డాల్‌గా అడుగు పెట్టిన ఈ బ్యూటీకి వరుస ఫ్లాపులు పలకరించడంతో తెగ బాధపడిపోతోందిట! ఆ బాధను దిగమింగి తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో వదిలిన కొన్ని ఫోటోలకు కుర్రకారు బెంబేలెత్తిపోతున్నారు. ఆ ఫోటోల్లో కాస్తా బోల్డ్‌గా పోజులిచ్చింది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. కొంత మంది భామలు ఎన్ని చిత్రాలు చేసినా.. సరైన గుర్తింపునకు నోచుకోరు. మరి కొంత మందికి మాత్రం తొలి చిత్రంతోనే కేక పుట్టిస్తారు. యువతరం గుండెల్లో గుబులు రేపుతారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు.

తాాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌ అవడంతో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది. నాగ శౌర్య ‘లక్ష్య’లో నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఈ భామ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా విషయానికి వస్తే….ఈ సినిమా 2022సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి తొలి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఈ సినిమా అక్టోబర్ 2, 2022నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, సుబ్బరాజు, నరేష్, ప్రభు తదితరులు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు. ఇక పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ తో కేతిక శర్మ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఆ మధ్య విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కేతిక శర్మకు మంచి పేరే వచ్చింది కానీ.. కెరీర్ కి దోహదపడలేకపోయింది. అది అలా ఉంటే ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది.

కేతిక శర్మ విషయానికొస్తే.. 24 డిసెంబర్ 1995లో న్యూ ఢిల్లీలో జన్మించింది. ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో ఈమె పాపులర్ అయింది. కేతిక శర్మ ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రంగరంగ వైభవంగా ఫ్లాప్ తర్వాత తన నెక్ట్ప్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా తెలుగులో ఈ భామకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఏమైనా సినిమాల విషయంలో ఈమె ఆచితూచి వ్యవహరించాలి!!