శంకర్ హిట్ సినిమా ’జెంటిల్మెన్’ కి సీక్వెల్ గా’ జెంటిల్మెన్ `2’ ప్రారంభమైంది. ఈ సీక్వెల్ కి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా…’జెంటిల్మెన్’ నిర్మాత కె.టి .కుంజుమోహన్ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తెలుగు దిగ్గజం కీరవాణిని తీసుకున్నారు.
జెంటిల్మెన్ కి రెహమాన్ బాణీలు అందించగా..సీక్వెల్ బాధ్యతలు కీరవాణికి అప్పగించారు. రెహమాన్ వివిధ కారణాలతో ఈ సినిమాకు సంగీతం అందించలేనని చెప్పడంతో కీరవాణికి అప్పగించారు. రహ్మాన్ తిరస్కరనతో ’ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వరించిన కీరవాణిని ఎంచుకున్నారు. తన సినిమాకి ఆస్కార్ రేంజ్ కంపోజర్ కావాలని కీరవాణిని దించారని టాక్.
రెహమాన్ కి పోటీగా కీరవాణిని తెరపైకి తెచ్చినట్లు కోలీవుడ్ లో గుస గుస వినిపిస్తుంది. పైగా జెంటిల్మెన్ `2 లాచింగ్ రోజున కీరవాణిని సాలువా..పూల మాలతో చిత్ర బృందం తరుపున సన్మానించారు. ఓ తమిళ వేదికపై తెలుగు సంగీత దర్శకుడికి ఇలాంటి గౌరవం దక్కడం పెద్ద విషయమే. సాధారణంగా తమిళ వేదికలపై తెలుగు వారికి ఇలాంటి గౌరవాలు చాలా అరుదు. కొన్ని రకాల కారణాలు అందుకు అడ్డంకిగా కనిపిస్తాయి. కానీ తమిళ నిర్మాత అయిన కుంజుమోహన్ అలాంటి వాటిని పక్కనబెట్టి కీరవాణిని సత్కరించడం నిర్మాతలందరి గౌరవాన్ని పెంచినట్లు అయింది.
