‘గేమ్‌ ఛేంజర్‌’ బాగా డిజైన్‌ చేశారు : కియారా అద్వానీ కితాబు

బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రాంచరణ్‌ తో గేమ్‌ ఛేంజర్‌లో నటిస్తోన్నది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా గురించి కియారా అద్వానీ ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్‌ చెప్పి.. మూవీ లవర్స్‌లో జోష్‌ నింపింది. టీం అంతా కలిసి ఈ సినిమాను రెండేళ్ల నుంచి షూట్‌ చేస్తుంది. 2023 చివరికల్లా సినిమా పూర్తవుతుందని చిత్రయూనిట్‌ ఆశిస్తోంది.

రాంచరణ్‌ తనకు ప్రియమైన స్నేహితుడని, శంకర్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. గేమ్‌ ఛేంజర్‌ చాలా బాగా డిజైన్‌ చేశారు. ఈ సినిమా కోసం నా వేళ్లు వంకర పోయాయంటే అర్థం చేసుకోండి. ప్రతీ ఒక్కరి అంచనాలకు మించి సినిమా ఉంటుంది. మేమంతా అహర్నిశలు చెమటోడ్చి పనిచేశామంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క అప్‌డేట్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బొనాంజా గిప్ట్‌ అందబోతుందని క్లారిటీ ఇచ్చేసింది కియారా అద్వానీ. ఆర్‌సి 15 ప్రాజెక్టుగా వస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌ లుక్‌ ఇప్పటికే నెట్టింట వైరల్‌ అవుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌లో బాలీవుడ్‌ యాక్టర్‌ హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తుండగా..రాజోలు బ్యూటీ అంజలి మరో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర, జయరాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ్జడెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందిస్తున్నారు. నెట్టింట చురుకుగా కనిపించే కియారా అద్వానీ ఇటీవలే సిల్వర్‌ కలర్‌ చమ్‌కీలతో డిజైన్‌ చేయబడ్డ గులాబీ రంగు డ్రెస్‌లో ర్యాంప్‌పై హళయలుపోతూ షోకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.