‘ఫర్హానా’ చాలా డిఫరెంట్ మూవీ: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాలు అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరో యూనిక్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ‘ఫర్హానా’. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మాన్‌ స్టర్‌, ఒరు నాల్‌ కూత్తు చిత్రాలు అందించిన నెల్సన్‌ వెంకటేశన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి మంచి స్పందన వచ్చింది. మే 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘ఫర్హానా’ నాకు చాలా స్పెషల్ మూవీ. నా మీద నమ్మకంతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ్ లో విడుదల చేయడానికి ముందుకు వచ్చి ఇంత భారీగా విడుదల చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. దర్శక నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఒక ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ మూడు భాషల్లో విడుదల కావడం పెద్ద విషయం. నెల్సన్ గారి చిత్రాలు యూనిక్ గా వుంటాయి. ఫర్హానా కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో చాలా బరువైన పాత్ర, ఇంటెన్స్ రోల్. షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక సవాల్ గా ఉండేది. అన్నీ లైవ్ లోకేషన్స్ లో షూట్ చేశాం. ఇంత బరువైన పాత్రని నేను మోస్తానని నమ్మిన దర్శకుడికి కృతజ్ఞతలు. సినిమాని సెలబ్రేట్ చేసే ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. మంచి కంటెంట్ ని సెలబ్రేట్ చేసే ఇండస్ట్రీ. ఆ నమ్మకంతో ఫర్హానా ని విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మే 12న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కలసి చూడండి. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అని కోరారు

దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ.. ఇది నా మూడో సినిమా. దేశంలో మోస్ట్ ప్యాషనేట్ ఆడియన్స్ తెలుగు రాష్ట్రాలలో వున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇంజన్ ఆఫ్ ఇండియన్ సినిమా. తెలుగు సినిమాలు వాటి గ్లోబల్ ఇంపాక్ట్ సౌత్ ఇండియన్ సినిమాని గొప్ప స్థాయికి తీసుకు వెళుతున్నాయి. రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివికమ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు.. ఇలా అందరి ప్రజన్స్ తో మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ రోజు తెలుగు సినిమా వున్నత స్థానంలో వుంది. ఈ మధ్య కాలంలో నాని దసరా సినిమా చూసి ఆశ్చర్యపోయాను. చాలా నచ్చింది. నాని కి బిగ్ ఫ్యాన్ అయిపోయా. కంటెంట్ ఉన్న సినిమాలని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. ‘ఫర్హానా’ అలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రం. ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. జస్టిన్ ఇప్పటికే తెలుగు లో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన మ్యూజిక్ ఒక ఎస్సెట్. నా మూడో చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది పక్కా తెలుగు సినిమాలా వుంటుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ చిన్న సినిమా పెద్ద సినిమాగా చేసి మరిన్ని సినిమాలు చేసే నమ్మకాన్ని ఇవ్వమని ప్రేక్షకులని కోరుతున్నాను’’

నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ.. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ విడుదల చేశాం, ప్రేక్షకులు దానికి అద్భుతమైన ఆదరణ ఇచ్చారు. ఇప్పుడు ‘ఫర్హానా’ తో వస్తున్నాం. ఫర్హానా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గ సినిమా అనిపించింది. ఫైనల్ కాపీ చూసి ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. నెల్సన్ తో మాకు ఇది రెండో సినిమా. చాలా అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చారు. చాలా నిజాయితీ గల దర్శకుడు. ఐశ్వర్య రాజేష్ తో పాటు అందరూ అద్భుతంగా నటించారు. మేము ఎలా అయితే ఎంజాయ్ చేశామో ప్రేక్షకులు కూడా తప్పకుండా సినిమాని ఆస్వాదిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

జస్టిన్ ప్రభాకర్ మాట్లాడుతూ.. నిర్మాత ఎస్ఆర్ ప్రభు గారికి, దర్శకుడు నెల్సన్ కి థాంక్స్. ఫర్హానా సినిమా ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నేపధ్య సంగీతం చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ప్రేక్షకులుకి కూడా థియేటర్ లో ఆ ఎక్సయిట్ మెంట్ వుంటుంది’’ అన్నారు.

ఐశ్వర్య దత్తా మాట్లాడుతూ..ఈ అవకాశం ఇచ్చిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కి థాంక్స్. నెల్సన్ గారితో పని చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. ఐశ్వర్య రాజేష్ కి నేను పెద్ద ఫ్యాన్ ని , తనతో కలసి నటించడం ఆనందంగా వుంది. తన నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మే 12 న అందరూ తప్పకుండా సినిమా చూడాలి’ అన్నారు.

జితన్ రమేష్ మాట్లాడుతూ.. నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు , దర్శకులు నెల్సన్ కి థాంక్స్. సినిమా అవుట్ పుట్ చాలా బావుంది. ఖచ్చితంగా సినిమా హిట్  అవుతుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు.