కొత్త కొత్త జానర్లతో ప్రయోగాలు.. దొరసాని దర్శకుడు కేవీఆర్ మహేంద్ర

దొరసాని సినిమాతో కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం, రచన ఎంత లోతుగా, ఎంత ఘాడంగా ఉంటుందో అందరికీ అర్థమైంది. దొరసాని సినిమాకు ఆయన రాసుకున్న మాటలు, తీసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ప్రేమ కథా చిత్రాలనే కాదు అన్ని రకాల జానర్లను హ్యాండిల్ చేయగలనని అందరికీ నిరూపించేస్తున్నారు కేవీఆర్ మహేంద్ర. ఆనంద్ దేవరకొండ , శివాత్మిక రాజశేఖర్ నటించిన దొరసాని సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.మహేంద్ర లేటెస్ట్ గా భరతనాట్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీమ్ ఫేకు, టెంపర్ వంశీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్‌లో విజయవంతంగా నడుస్తోంది. క్రైమ్ సీక్వెన్స్, కామెడీ సీన్స్‌ను బాగానే హ్యాండిల్ చేశాడనే పేరు తెచ్చుకున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తే హిట్టు కొట్టేయొచ్చని మళ్లీ రుజువు అయ్యింది. ఇక త్వరలో దర్శకుడు కె.వి.మహేంద్ర మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓ రెండు, మూడు పీరియాడికి క్రైమా డ్రామా స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయట. అందులో ఏదో ఒకటి ఫైనల్ కానుందని సమాచారం.