మాస్టో ఇళయారాజ ఆశీస్సులు తీసుకున్న దేవిశ్రీ!

భారతీయ సినీ చరిత్రలోనే తన సంగీతంతో ఎంతోమంది కుర్రకారును ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మథుడు, ఆర్య, పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు తన మ్యూజిక్‌ అందించారు.

ఇక తాజాగా పుష్ప సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌ నేషనల్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా చెన్నై వెళ్లిన దేవిశ్రీ తనకు సంగీత గురువైనా మ్యూజిక్‌ మ్యాస్టో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని దేవిశ్రీ సోషల్‌ విూడియా వేదికగా వెల్లడిరచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.