బెల్లంకొండ సాయి శ్రీనివాస్, #BSS11 అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభం

హైదరాబాద్, 1 జూలై 2024: షైన్ స్క్రీన్స్ 8వ చిత్రం, ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్ గా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ప్రారంభమైయింది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నవీన్ యెర్నేని క్లాప్ కొట్టగా, నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. సతీష్ కిలారు, అన్మోల్ శర్మ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు.

డిఫరెంట్ వరల్డ్, యూనిక్ ప్రిమైజ్ లో సెట్ చేయబడిన ఈ హారర్-మిస్టరీ మూవీ ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో సంచలనం సృష్టించింది.

ఈ మూవీలో యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఎవర్ ఛార్మింగ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ గ్రిప్పింగ్ నెరేటివ్ అందించబోతున్నారు. ఇద్దరు యాక్టర్స్ తమ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్రలతో సినిమాపై ఎక్సయిట్మెంట్ ని పెంచుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ జూలై 11న ప్రారంభమై శరవేగంగా సాగనుంది.

ట్యాలెంటెడ్ కాస్ట్ అండ్ క్రూ తో పాటు యూనిక్ స్టొరీ లైన్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

కాస్ట్ & క్రూ డిటేల్స్:

షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం:8

శ్రీమతి అర్చన ప్రెజెంట్స్

నిర్మాత – సాహు గారపాటి
రచన & దర్శకత్వం – కౌశిక్ పెగళ్లపాటి

సంగీతం – బి. అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ – చిన్మయ్ సలాస్కర్
ప్రొడక్షన్ డిజైన్ – మనీషా ఎ దత్
ఆర్ట్ డైరెక్టర్ – డి శివ కామేష్
ఎడిటర్ – నిరంజన్ దేవరమానే
ఫైట్స్: జాషువా మాస్టర్
సహ రచయిత – దరహాస్ పాలకొల్లు
కో-డైరెక్టర్ – లక్ష్మణ్ ముసులూరి
క్రియేటివ్ హెడ్ – కనిష్క.జి
ప్రొడక్షన్ కంట్రోలర్- సుబ్రహ్మణ్యం ఉప్పలపాటి
కాస్ట్యూమ్ డిజైనర్- లంకా సంతోషి
Vfx-DTM
పీఆర్వో – వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచెర్ల
మార్కెటింగ్ – ఫస్ట్ షో