భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ ఆగస్ట్ 8న రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని గతంలో రిలీజ్ చేసిన టీజర్ను చూస్తేనే అందరికీ అర్థమై ఉంటుంది. ఇక తాజాగా ఈ సిరీస్కు సంబంధించిన ట్రైలర్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో, దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఆదివారం నాడు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో..
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ చాలా బాగుంది. మై విలేజ్ షో టీం అందరికీ స్పూర్తి. ఇక్కడి వాళ్ల గురించి అమెరికాలో మాట్లాడుకునేవారు. ‘పెళ్లి చూపులు’ చేసే టైంలోనూ ఏదో చరిత్ర సృష్టించాలని అనుకోలేదు. సింక్ సౌండ్తో ఆ మూవీని చేశాం. ఆ టైంలో మధుర శ్రీధర్ గారు మాకు అండగా నిలిచారు. భాష, యాస అందరినీ కలిపేసుకుని పోయేలా ఉండాలి. సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు. మై విలేజ్ షో టీం డెడికేషన్, సంకల్పం అన్నింటి కంటే గొప్పది. అనిల్ ఇంకా ఎంతో ఎత్తుకి ఎదుగుతారని నమ్మకంగా చెబుతున్నాను. ఈ ఈవెంట్కు నన్ను పిలిచి ప్రమోషన్స్లో భాగం చేసిన అందరికీ థాంక్స్. ఈ సిరీస్ అద్భుతంగా ఉండబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
అనిల్ గీలా మాట్లాడుతూ .. ‘ఇలాంటి ఓ స్టేజ్కు రావాలని చాలా ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాం. ‘మై విలేజ్ టీం’కి పని చేసే వారంతా కూడా ఒక్కో పనిలో బిజీగా ఉండేవాళ్లం. అందరం కలిసి చేసిన ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. శ్రీకాంత్ అన్న మా ప్రయాణానికి టర్నింగ్ పాయింట్. మా ఊర్లోనే చిన్న చిన్నగా పని చేస్తూ అన్ని క్రాఫ్ట్ల మీద పట్టు సాధించాం. క్యాస్టింగ్ కాల్ ఎక్కడ కనిపించినా నేను సంప్రదిస్తుండేవాడిని. అలా విజయ్ అన్న ద్వారా తెరపైకి వచ్చాను. తరుణ్ అన్న మా అందరికీ స్పూర్తి. శ్రీధర్ అన్న, జీ5 టీం ఫోన్ చేసిన వెంటనే వెళ్లి ఈ కథను చెప్పాం. ఇప్పుడు ఈ రోజు ఇలా స్టేజ్ మీద ఉంటే.. మేం ఏదో సాధించామనే ఫీలింగ్ కలుగుతోంది. జీ5 టీం, శ్రీధర్ అన్న మా అందరినీ నమ్మి ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. మమ్మల్ని అంతగా నమ్మిన శ్రీధర్ అన్నకి థాంక్స్. చరణ్ అన్న అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ఆగస్ట్ 8న జీ5లో ఈ సిరీస్ వస్తోంది. అందరినీ ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. కుటుంబ సమేతంగా మూడు గంటల పాటు ఏడు ఎపిసోడ్స్ చూసేలా ఉంటుంది’ అని అన్నారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ .. ‘తెలంగాణలో ఇలాంటి కొత్త కథలు రావడానికి తరుణ్ భాస్కర్ స్పూర్తి. మా కార్యక్రమానికి వచ్చిన ఆయనకు థాంక్స్. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథగా ‘మోతెవరి లవ్ స్టోరీ’ రాబోతోంది. ఈ సిరీస్ తరువాత మరెన్నో గొప్ప ప్రేమ కథలు వస్తాయి. ఇది చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ అలరిస్తుంది. అందరికీ ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నా’ అని అన్నారు.
నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ .. ‘మేం మొదట్లో పెద్ద చిత్రాలకు స్పూఫ్ చేస్తుండేవాళ్లం. అలా ‘పెళ్లి చూపులు’కి స్పూఫ్ చేసి ప్రైవేట్లోనే పెట్టుకున్నాం. మై విలేజ్ షో నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాం. ఇది మాకు ఆరంభమే. మున్ముందు మరింత చేయబోతోన్నాం. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జీ5కి థాంక్స్’ అని అన్నారు.
జీ5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ మాట్లాడుతూ .. ‘జీ5 తెలుగు జర్నీలో గ్రామీణ వాతావరణం, మన మూలాల్లోంచి కథల్ని తీసుకు రావాలని అనుకున్నాం. అలాంటి టైంలో మై విలేజ్ షో టీం గుర్తుకు వచ్చింది. అనిల్తో జరిగిన ఫస్ట్ మీటింగ్లోనే ఈ కథ సెట్ అయింది. ఓ పుస్తకం చదివినట్టుగా ఈ కథ ఉంటుంది. శివ ఈ సిరీస్ను చాలా కొత్త మేకింగ్తో రూపొందించారు. చరణ్ ఆర్ఆర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. మా జీ5 ప్రయాణంలో ఇక అనిల్ ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటారు. శ్రీధర్ గారు మాకు ఈ సిరీస్ వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆగస్ట్ 8న జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
దర్శకుడు శివ కృష్ణ బుర్రా మాట్లాడుతూ .. ‘‘మై విలేజ్ షో’ ద్వారా మాకు వచ్చిన ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రమంలోనే అందరినీ ఆకట్టుకునేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ రూపొందించాం. అందరినీ నవ్వించేలా, మెప్పించేలా ఉంటుంది. మాకోసం వచ్చిన తరుణ్ భాస్కర్ అన్నకి థాంక్స్. చరణ్ అన్న పాటలు, మాటలు ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉంటాయి. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీధర్ అన్నకి, జీ5 టీంకు థాంక్స్. అనిల్, వర్షిణి, సదన్న ఇలా అందరూ అద్భుతంగా నటించారు. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన మా టీం, ఆర్టిస్టులందరికీ థాంక్స్’ అని అన్నారు.
వర్షిణి మాట్లాడుతూ .. ‘నాకు తరుణ్ భాస్కర్ గారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ గారికి, జీ5 టీంకి, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ కథ విన్నప్పుడే అద్భుతంగా ఉండబోతోందని అర్థమైంది. ‘పెళ్లి చూపులు’ చూసిన తరువాత మన సినిమా వచ్చిందన్న సంతోషం కలిగింది. ‘దొరసాని’ చూసిన తరువాత మధుర శ్రీధర్ గారితో పని చేయాలన్న కోరిక ఇప్పుడు నెరవేరింది. అనిల్, వర్షిణి అద్భుతంగా నటించారు. మై విలేజ్ షో టీంతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
చరణ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘మా టీం అందరికీ ‘మోతెవరి లవ్ స్టోరీ’ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సిరీస్ అద్భుతంగా వచ్చింది. నేను ఆల్రెడీ ఈ సిరీస్ చూశాను. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. ‘పెళ్లి చూపులు’, ‘దొరసాని’ కొత్త ఒరవడిని సృష్టించాయి. అనిల్లో నాకు రవితేజ, రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. సదన్న అద్భుతంగా నవ్విస్తారు. శివ ఈ సిరీస్ను అద్భుతంగా రూపొందించారు. ఆగస్ట్ 8న ఈ సిరీస్ జీ5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.





