‘కెప్టెన్ మిల్లర్’- తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల చేస్తున్న ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ మినహా అన్ని భాషలలో ఈ రోజు విడుదల కానుంది.

ఈ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేసిన ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్‌ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ మద్దతుతో కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

కెప్టెన్ మిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సంచలనం సృష్టించాయి.

ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని అందించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీత సమకూర్చారు. టి రామలింగం ప్రొడక్షన్ డిజైనర్.

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. నాగూరన్ ఎడిటర్.

తారాగణం: ధనుష్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్
సమర్పణ: T.G. త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సిద్ధార్థ నుని
ఎడిటింగ్: నాగూరన్
ఆర్ట్: టి. రామలింగం
పీఆర్వో: వంశీ-శేఖర్