పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ఫస్ట్ క్యారెక్టర్ పోస్టర్‌ లో ఇంటెన్స్ లుక్ లో అడివి శేష్

ఫస్ట్ ఇమేజ్ లో తీక్షణమైన చూపులతో, ముఖాన్ని బ్లాక్ స్కార్ఫ్ తో కప్పుకొని చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు అడివి శేష్. అతని కుడి చెవిలో బంగారు చెవిపోగులు, అతని నుదిటిని కప్పి ఉన్న లాంగ్ లాక్స్ లుక్ కు స్టైల్, స్వాగ్‌ని జోడించాయి.

ఆసక్తికరంగా, ఈ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అడివి శేష్ ఫస్ట్ లుక్ చిత్రాన్ని పోస్ట్ చేసి “#SeshEXShruti తనని పరిచయం చేస్తున్నాము – @adivisesh ❤‍🔥అతని రాక ఆమె జీవితంలో తుఫానును తెస్తుందా? టైటిల్ , ఫస్ట్ లుక్ డిసెంబర్ 18న 🔥” అని రాశారు.

హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

అడివి శేష్ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చేస్తున్న మెగా ప్రాజెక్ట్ అడివి శేష్ కు రెండో స్ట్రయిట్ హిందీ మూవీ కానుంది.

అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు గతంలో డీవోపీగా పనిచేసిన షానీల్ కు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్ కు ఆయన దర్శకత్వం వహించారు.

“సినిమాలోని ప్రతి ఫ్రేమ్, డైలాగ్, సన్నివేశాన్ని హిందీతో పాటు తెలుగులో విడివిడిగా చిత్రీకరిస్తున్నాం. ప్రతి భాష సాంస్కృతిక ప్రత్యేకత బట్టి దీనిని విభిన్నంగా ట్రీట్ చేస్తున్నాం” అని మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు.

ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ-నిర్మాత. అడివి శేష్ , షానీల్ డియో కలిసి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.