మార్చి 10న హీరో ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” విడుదల

హీరో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “సీఎస్ఐ సనాతన్” మార్చి 10న విడుదల.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ తో గ్రిప్పింగ్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ చిత్రానికి శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహించగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ బ్యానర్ లో విడుదల కి సిద్ధంగా ఉంది.

మర్చి 10న థియేటర్లలో విడుదలవనున్న ఈ సినిమా విజయంపై నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు.

న‌టీన‌టులు : ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వాసంతి తదితరులు.

సాంకేతిక వ‌ర్గం :
సినిమాటోగ్ర‌ఫీ: జి. శేఖ‌ర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ. జి ఎస్ కె మీడియా
నిర్మాత: అజ‌య్ శ్రీనివాస్
ద‌ర్శ‌కుడు: శివ‌శంక‌ర్ దేవ్