కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం అంతా బాగాలేదు. అయినా సరే ఆయనలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంది. బిజెపి ఆయన్ని హెల్త్ కారణాల వల్ల ప్రచారానికి దూరంగా పెట్టిన ఆయన మాత్రం పార్టీకి ఇంకో రూపంలో ప్రచారం చేస్తూ ఆరోగ్యాన్నితానే లెక్క చేయనని రుజువు చేసుకుంటున్నారు.
చాలా కాలం ఆయన చికిత్సచేయించుకుంటూ అమెరికాలో ఉన్నారు. అపుడు ఆర్థిక శాఖను చూడమని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కుచెప్పారు. చికిత్స నుంచి వచ్చాక ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు తిరిగి చేపట్టారు. ఆయన ఆరోగ్యం బాగా లేనందున ఆయన భారతీయ జనతాపార్టీ ప్రచారానికి తిప్పడం లేదు. ఆయనను స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చ లేదు.
ప్రధాని మోదీ దేశమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తర్వాత ప్రధానంగా తిరుగుతున్నది పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. వీళ్లిద్దరే కాకుండా, హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వంటి వాళ్లు కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. గత నాలుగేళ్లు కేంద్రం లో నెంబర్ టూ గా వెలిగిన అరుణ్ జైట్లీ ఎక్కడా ప్రచారం కనిపించకపోవడం స్పష్టమయిన వెలితి.
అయితే, ఆయన ఈ వెలితి మరొక రూపంలో తీరుస్తున్నారు. రోజూ కాంగ్రెస్ మీద నిప్పులు చెరుగుతున్నారు. ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో విజృంభిస్తూ తాను అనారోగ్యంగా లేనని, ఒక వేళ ఉన్నా లెక్కచేయనని, మోదీని రెండోసారి ప్రధానిని చేయడమే తన ధ్యేయమన్నట్లు ఆయన రాహుల్ గాంధీ మీద, ఇతర ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు.
నిన్నటికి నిన్న కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలయిందో లేదో తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మ్యానిఫెస్టోను ఖండించేశారు. తాను ఫీల్డ్ లో ప్రచారంలో లేకపోయినా సరే ఉన్నట్లే అన్నట్లు ఆయన కాంగ్రెస్ మీద మాటల దాడి తీవ్రం చేశారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన యాక్టివ్ అయ్యారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అరుణ్ జైట్లీ ఉత్సాహం రెట్టింపయ్యేందుకు కారణమేమిటనేది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమయిన చర్చ నడుస్తూ ఉంది.
అరుణ్ జైట్లీలో భవిష్యత్తు గురించి మోదీ, షా ఎత్తుగడల గురించి ఏదో భయం పట్టుకుందని ఈవర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఆరోగ్యం బాగా లేకపోయినా, తాను పార్టీకి చాలా ఉపయోగపడతానని ఆయన రుజువుచేసుకుంటున్నారని ఈవర్గాలు చెబుతున్నాయి.
ఇంగ్లీష్ ట్వీట్
Article 35A surreptitiously inserted in the Constitution prevented investment & job creation in J&K and sufferers are people of the State. pic.twitter.com/61UU3ONqrj
— Chowkidar Arun Jaitley (@arunjaitley) March 28, 2019
जम्मू कश्मीर के सम्बंध में नेहरु के दृष्टिकोण उचित नहीं थे। अब समय आ गया है कि हम विशेष दर्जे से अलगाव तक की यात्रा को विराम दें। pic.twitter.com/456YTaDPQe
— Chowkidar Arun Jaitley (@arunjaitley) March 28, 2019
ఈ మధ్య మోదీ- షాలు పార్టీలో సీనియర్ల నందరిని తరిమేశారు. ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వాళ్లు ముసలోళ్లయ్యారని పార్టీ టికెటివ్వలేదు. కేవలం వృద్ధాప్యంమే కాదు, ఏవో తెలియని ఇతర కారణాలవల్ల మరి కొంతమంది సీనియర్లకు లోక్ సభ టికెట్లు నిరాకరించారు. ఇలాంటి వారిలో ప్రముఖుడు బీహార్ కు చెందిన షా నవాజ్ హుసేన్.
వాజ్ పేయి ప్రభుత్వం ఆయన బిజెపి ముస్లిం ముఖమ్ ఆయనే. అంతకాదు,మంత్రిగా , పార్లమెంటేరియన్ గా ఆయన బాగా విజయవంతమయిన బిజెపి ముస్లిం నేత. చాలా స్పష్టత ఉన్న నాయకుడు.
పార్లమెంటులో చాలా సార్లు ఆయనను నాటి బిజెపి ప్రధాన వక్తను చేసిన సందర్భాలున్నాయి. అలాంటి నవాజ్ హుసేన్ కు ఈ సారి టికెట్ ఇవ్వలేదు. నవాజ్ వయసు కేవలం 50 సంవత్పరాలే. 2014 లో ఆయన భాగల్పూర్ నుంచి పోటీడచేశారు. మోదీ హవా నడుస్తున్నా ఓడిపోయారు. నవాజ్ నిరుత్సాహ పడలేదు. 2019 ముందుందనుకుని ముందకు సాగిపోతూ ఇంత దాకా వచ్చారు. అయితే, 2019 ఎన్నికల్లో భాగల్పూర్ ను బిజెపి నితీస్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యునైటెడ్ )కు కేటాయించి, నవాజ్ కలని భగ్నం చేసింది.
అయినా సరే, హుసేన్ పార్టీని పల్లెత్తు మాట అనకుండా బిజెపి కేంద్ర కార్యాలయంలో కూర్చుని రోజూ విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడుతూ, నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాని అవుతారని చెబుతున్నారు. తానింకా పార్టీకి ఉపయోగపడతానని మోదీ-షా గుర్తించాలని, వారి కంటపడాలని నవాజ్ తాప్రతయం. అదే జరిగితే, రాజ్య సభ నామినేషనయినా వస్తుందని ఆశ.
ఇక అరుణ్ జైట్లీ దగ్గరకు వస్తే, ఆయన పరిస్థితి ఇంతే. అనారోగ్యంతో ఉన్న తాను ఇక పార్టీకి పనికిరాడని మోదీ-షా భావిస్తారేమోననే భయం అరుణ్ జైట్లీకి పట్టకుందని దేశ రాజధానిలో ఒక టే చర్చ.
అందుకే సోషల్ మీడియాలో తెగ యాక్టివైపోయి, ఫీల్డ్ లో ఎన్నికల ప్రచారంలోతాను లేనన్నకొరత తీరుస్తున్నారు. మధ్య మధ్య విలేకరుల సమావేశాలు కూడా ఏర్పాటు చేసి తనకు ఎంత శక్తి వుందో నిరూపించుకుంటున్నారు.
ఇలాంటపుడు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అరుణ్ జీ అంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు, అవి నార్త్ ఇండియాలో చదువురాని వాళ్ల కేం అర్థమవుతాయని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎక్కడో అన్నట్లు అరుణ్ జైట్లీకి దృష్టికి వచ్చింది.
అంతే, వెంటనే పుంఖానుఫుంఖాలుగా ఆయన హిందీ వీడియోలు తయారు చూసి గాల్లోకి వదిలేశారు. తన న్యూఢిల్లీ బంగళా తోటలో నో ఇంట్లోనో సోఫా మీద కూర్చునో లేదా పచ్చిక మీద పచార్లు చేస్తూనో, తన ఇంగ్లీష్ బ్లాగ్స్ లో రాసిందాన్నంతా పొల్లు పోకుండా హిందీలో చెబుతూ కనిపిస్తారు. మరి ఇవన్నీ మోదీ-షా ల దృష్టికి తప్పక పోయి తీరాలి. హిట్ లిస్టులో ఆయన పేరు నిజంగా ఉంటే గింటే …తీసేయాలిమరి.
