కాశ్మీర్ లో సిఆర్ పిఎఫ్ కాన్వాయ్ మీద జెయిష్ తీవ్రవాది ఆత్మాహుతి దాడి జరిపినపుడు ప్రధాని మోదీ ఎక్కడున్నారు?
ప్రధాని మోదీ జిమ్ కార్బెట్ పార్క్ లో ఒక ఫిల్మ్ షూటింగ్ లో ఉన్నారా? దాడి మధ్యాహ్నం జరిగి 45 మంది జవాన్లు అమరులైతే, దేశమంతా అతలాకుతలమయిన వార్తలొస్తున్నా మోదీ అక్కడే ఉన్నారా? రాత్రి ఏడుగంటలపుడు అక్కడి పిడబ్ల్యుడి గెస్ హౌస్ లో ఆయన సమోస తింటూ చాయ్ తాగుతున్నారా?
అవునని అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలోని కోట్లాది ప్రజల హృదయాలు, అమరులయిన జవాన్ల కుటుంబాలు శోక సంద్రం లో మునిగిపోయి ఉంటే, ప్రధాని మోదీ చిరునవ్వులు చిందిస్తూ పార్క్ లో నీళ్లలో నిలబడి ఫోటోలు తీయించుకుంటున్నారు అని ‘PhotoShootSarkar’ హాష్ ట్యాగ్ లో రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ప్రధాని మీద విరుచుపడ్డారు.

पुलवामा में 40 जवानों की शहादत की खबर के तीन घंटे बाद भी ‘प्राइम टाइम मिनिस्टर’ फिल्म शूटिंग करते रहे।
देश के दिल व शहीदों के घरों में दर्द का दरिया उमड़ा था और वे हँसते हुए दरिया में फोटोशूट पर थे।#PhotoShootSarkar pic.twitter.com/OMY7GezsZN
— Rahul Gandhi (@RahulGandhi) February 22, 2019
పుల్వామా తీవ్రవాద దాడిలో 40 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందిన వార్తలు వ్యాపించాక కూడా మూడు గంటల పాటు ప్రధాని షూటింగ్ కొనసాగుతూనే ఉంది,’ అని ఆయన హిందీ ట్వీట్ లోపేర్కొన్నారు.ఇందులో దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి.
ఫిబ్రవరి 14 జిమ్కాకార్బెట్ నేషనల్ పార్క్ లో ఒక స్వీయ ప్రచార కార్యక్రమం కోసం ఫోటోలు తీయించుకునే పనిలో ప్రధాని ఉన్నారు. జవాన్ల కాన్వాయ్ మీద మధ్యాహ్నమే దాడి జరిగినా ప్రధాని సాయంకాలం దాకా అదే పనిలోనే ఉన్నారని కాంగ్రెస్ మీడియా రిపోర్టులను ఉటంకిస్తూ ప్రధాని మీద దాడి తీవ్రతరం చేసింది.
