భారత దేశపు మొట్టమొదటి దేశీయ సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ ప్రారంభమయిన మరుసటి రోజే గాడి తప్పింది.
శుక్రవారం నాడే ఈ రైలు అట్టహాసంగా ఢిల్లీ నుంచి ప్రారంభమయింది. వారణాసి చేరుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా అనుకోని విధంగా అవాతరం ఎదురయింది. రైలాగిపోయింది. అధికారులను పరుగులు పెట్టించింది.
ఢిల్లీకి 200 కి.మీ దూరాన శనివారం ఉదయం ఈ ‘ఇంజన్ లేని రైలు’ కు సమస్య ఎదురయింది.దీనికి ‘స్కిడ్డింగ్ వీల్స్’ సమస్య ఎదురయిందని అధికారులు చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని తుండ్లా జంక్షన్ కు 15కి.మీ దూరాన ఉన్నపుడు రైలు చక్రాలు గాడి తప్పాయి.
ఎందుకు తప్పాయనే దాని మీద సరైన సమాచారం లేదు. పశువులు రైలు కిందపడటంతొ చక్రాలు గాడి తప్ప ఆపాల్సి వచ్చిందని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్అధికారి దీపక్ కుమార్ చెప్పారు.
శుక్రవారంనాడు ప్రధాని ప్రారంభించిన ఈ రైలు ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోవాలి. ఆదివారం ఉదయం ప్రయాణికులతో మొదటి ప్రయాణం వారణాసికి చేయాల్సి ఉంది. ఈ ప్రమాదం తర్వాత ఆదివారం ప్రయాణం అనుమానాస్పదంగా తయారయింది.
Inspecting Vande Bharat Express breakdown near Tundla. Trying to find what went wrong. @IndianExpress pic.twitter.com/e1C4hOLr4D
— Avishek Dastidar (@avishekgd) February 16, 2019
వారణాసి నుంచి ఢిల్లీ వస్తున్న రైలులోనే ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ విలేకరి చెప్పిన సమాచారం ఇలా ఉంది: వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రెయిన్ 18) బ్రేకులు బిగుసుకు పోవడం ఆపాల్సి వచ్చింది. తర్వాత బ్రేక్స్ ను సరిచేశారని, రైలు గంటకి నూరు కిమీ వేగంతో పరుగులు తీసిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.
‘‘రైలు పూర్తిగా ఆగిపోడానిక ముందు రైలు చివరి బోగీల నుంచి కటకటమని శబ్దం వచ్చింది. ఇది గమనించిన లోకో పైలట్లు అనుమానంతోనే స్పీడ్ తగ్గించారు. చివరి నాలుగు బోగీలనుంచి దుర్వాసన వచ్చింది. పొగ కూడా కనిపించింది. తర్వాత ఈ బోగీలలో కరెంట్ కూడా పోయింది. నిజానికి ఈ రైలు రెండుగంటల యాభై నిమిషాలలో ఢిల్లీకి చేరుకోవలసి ఉండింది. అయితే, లోపమేమిటో తెలుసుకునేందుకు ఇంజనీర్లు బోగీల అడుగుబాగాన్నంతా టార్చ్ లైట్లు వేసి, అనేక పరికరాలు ఉపయోగించి పరిశీలించారు.
‘‘అధికారులు తెలిపారు. రైలు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులను ఇతర రైళ్లలో గమ్య స్థానాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ఇంజినీర్లు వెంటనే లోపాన్ని గుర్తించి సవరించడంతో మళ్లీ 8:30గంటలకు రైలు దిల్లీకి బయలుదేరింది. దేశీయంగా తయారు చేసిన ఈ రైలు భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలుగా పేరుగాంచింది.
‘‘పార్కింగ్ బ్రేక్, హోల్డింగ్ బ్రేక్ జామ్ అయినట్లు అధికారులు కనుగొన్నారు. దానికి తోడు చార్జింగ్ కూడా పెయిల్ అయిందని వారు కనుగొన్నారు. తర్వాత ఇంజనీర్లు బ్రేక్ లను సడలించి పది కి.మీ వేగంతో రైలు కదిలేలా చేశారు.అయితే, రైలు ఖాళీ గా ఉండటంతో ఆ నాలుగు బోగీలనుంచి కటకట శబ్దం మళ్లీ మొదలయింది. దీనితో అక్కడి ఇంజనీర్లు పై అధికారులను మళ్లీ సంప్రదించారు. ఈ సారి రైలు వేగం 40 కి.మీ పెంచారు. ఇది కూడా పనిచేయకపోవడంతో రైలును అధికారులు చమ్రౌలా వద్ద పూర్తిగా నిలిపివేశారు.’’
వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. విషయం తెలిసిందే. గంటకు 180కి.మీ వేగంలో ప్రయాణించగల సామర్థ్యంతో తమిళనాడు పెరంబూరులో నిర్మించిన ఈ రైలు శుక్రవారం 130కి.మీ వేగాన్ని అందుకుంది. ఇపుడు ట్రయల్ రన్ లో ఉంది. ఆదివారం నాటి తొలి ప్రయాణికి టికెట్లన్నీ బుక్ అయ్యాయి.
