షోషల్ మీడియాకు ఉన్న దుర్గుణం (లేదా సద్గుణం) తెలిసింది వెంటనే షేర్ చేయాలనిపించడం. సోషల్ మీడియా కు ఉన్న ఈ వశీకరణ శక్తికి లోబడని వాళ్లుండరు. యుక్తవయసులో ఉండే మిల్లీనియల్స్ కాదు, పెద్దవాళ్లు, పొజిషన్స్ లో ఉన్నవాళ్లు కూడా షేరింగ్ ఆకర్షణలో పడుతూ ఉంటారు. దీనికి తాజా ఉదాహరణ త్రిపుర గవర్నర్ తధాగత రాయ్. ఆయన వాజ్ పేయి చనిపోయారని ట్వీట్ చేశారు. ఒక వైపు మాజీ ప్రధాని వాజ్పేయి కి ఇంకా చికిత్స సాగుతూ ఉందని, ఆయన క్రిటికల్ గా ఉన్నారని ఎయిమ్స్ నుంచి వార్తలు వస్తున్నపుడు ఉన్నత స్థానంలో ఉన్న ఒక గవర్నర్ నుంచి వాజ్ పేయి మరణ వార్త ట్వీట్ రావడం తో అది వైరలైపోయింది. ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే ఆయన స్పందించారు. తన పాత ట్వీట్ ను తొలగించేశారు.

‘‘క్షమించండి. ఒక జాతీయ టీవీ చానెల్లో వచ్చిన వార్తలను చూసి నేను అలా ట్వీట్ చేశాను. దానికిముందుకు ఈ వార్త నిజమా కాదా అనేది విచారించి ఉండాల్సింది. మాజీ ప్రధాని వాజ్పేయి ఆరోగ్యం మీద ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నా ట్వీట్ను తొలగించేశాను. క్షమించాలని మరొకసారి నెటిజన్లను కోరుతున్నాను..’’ అని విచారం వెలిబుచ్చారు.
I am sorry I tweeted something upon being told by an all-India TV channel. I had taken it to be authentic. There has so far been no official announcement. I have deleted my tweet. Sorry again
— Tathagata Roy (@tathagata2) August 16, 2018
వాజ్పేయి ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉంది. ఆయన ఇంకా వెంటిలేటర్పైనే ఉన్నారు. అన్ని రాకాల చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదలచేశారు.
