కేరళలోనే కాదు కర్ణాటకలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారిపోయాయి. కర్ణాటకలోని మడికెరి అనే పట్టణ పరిసరాల్లో అబ్బీ జలపాతం ఉంది. ఈ జలపాతం ఎల్లప్పుడూ టూరిస్ట్ లతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది.
మడికెరి పట్టణంలో భారీ వర్షాల కారణంగా టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ పైన వీడియోలో కనిపిస్తున్న ప్రాంతంలో 40 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. బస్సులో కొందరు ఉన్నారు. వారు వరదల్లో చిక్కుకుపోయారు. బస్సు నుంచి బయటకు వచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. వీడియో చూడండి ఎంత డేంజర్ గా అక్కడ పరిస్థితి ఉందో తెలుస్తుంది.
