సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ దాఖలు చేసిన అఫిడవిట్ విషయంలో సుప్రీంకోర్టులో ఈ రోజు అసాధారణమయిన పరిస్థితి ఏర్పడింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద ఇదే కోర్టులో ఒకపుడు పని చేసిన మహిళ ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కొత్త మలుపు తిరుగుతూ ఉంది. ఈవ్యవహారంలోకి డిసిగ్నెటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం, ఒక కార్పొరేట్ సంస్థ ప్రమేయం ప్రస్తావనకు వచ్చింది. దీనితో ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం సిబిఐ,ఢిల్లీ పోలీస్ ఐబి చీఫ్ లను ఆదేశించింది. విచారణ మధ్యాహ్నం మూడు గంటలకు పున: ప్రారంభమవుతుంది.
ఈ కేసు విచారణ నేపథ్యంలో ఉత్సవ్ ఒక ఫేస్ బుక్ లో పోస్టు పెడుతూ దీని వెనక ఒక కుట్ర జరుగుతూ ఉందని, ప్రధాన న్యాయమూర్తిని పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీని మీద ఆయన కోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు.
ఆపైన సుప్రీంకోర్టు ఆయనను ఈరోజు పదిగంటలకు కోర్టు ముందుకు రావాలని చెప్పింది. ఇదొక అసాధారణమయిన అంశమని పేర్కొంది. ఈ రోజు ఉత్సవ్ కోర్టుకు బెంచ్ ముందు హాజరయి ఒక సీల్డ్ కవర్ అందించారు.
ఈ కవర్ లోని అంశాలను పరిశీలించిన తర్వాత న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఆర్ ఎఫ్ నారిమన్, దీపక్ మిశ్రాల క ధర్మాసనం , ‘ఇది చాలా తీవ్రమయిన పరిణామం, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేది,’అని వ్యాఖ్యానించింది.
ఇది చాలా సున్నితమయిన అంశమని, తానుపొందుపరిచిన అంశాలమీద సమాచారం సేకరించేందుకు న్యాయవిచారణ జరగాలని ఉత్సవ్ కోరారు.
అనంతరం కోర్టు సిబిఐ,ఢిల్లీ పోలీస్ ఐబి చీఫ్ లను కోర్టుకు రావాలని కోరింది. విచారణ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది.
టెర్రిరిస్టుగా గుర్తించిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు రమేష్ శర్మ, మరొక కార్పొరేట్ పెద్ద మనిషి చేతులు కలిపి ప్రధాన న్యాయమూర్తిని లైంగిక వేధింపులు కేసులో ఇరికించాలని చూస్తున్నారని అఫిడవిట్ లో ఉత్సవ్ పేర్కొన్నారు. దీనీ మీద సమాచారం సేకరించేందుకే ఉత్సవ్ నుకోర్టు ముందుకు పిలిచారు.
ఈ కేసులో బాధితురాలిని తరఫున వాదించి, ఆమె చేత ప్రెస్ క్లబ్ లో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటుచేస్తే కోటిన్నర రుపాయల లంచం ఇస్తామని ఒక వ్యక్తి తనను సంప్రదించారని కూడా ఉత్సవ్ తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ మీద వచ్చిన ఆరోపణలను విచారించేందుకు జస్టిస్ ఎస్ఎ బాబ్డే నాయకత్వంలో ఒక కమిటీని వేశారు. ఇాది అంతర్గత (in-house) విచారణ చేస్తూ ఉంది. ఈ కమిటీలో జస్టిస్ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉన్నారు. ఫిర్యాదు చేసిన మహిళను ఏప్రిల్ 26న కమిటీ ముందుకు రావాలని ఆదేశించారు.
