రూ. 10 ఇవ్వలేదని మద్యం మత్తులో ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలుసా?

ప్రస్తుత కాలంలో హత్యలు, ఆత్మహత్యలు అనేవి కామన్ గా మారిపోయాయి. చాలామంది క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోలేక తమ ప్రాణాలు తీసుకోవడం, లేదా ఎదుటి వారి మీద కోపంతో వారి ప్రాణాలు తీయడం అనేది అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులు. ఇందులో ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలుగా తయారై ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి
ఘటన పశ్చిమ బెంగాల్ లో సంభవించింది. కేవలం పది రూపాయల కోసం గొడవపడి తన స్నేహితుడిని బండరాయితో తల మీద కొట్టి హత్య చేశాడు సదరు స్నేహితుడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లోని సిడిగుడి లో జరిగింది.

వివరాల్లోకి వెళితే…. రాంప్రసాద్, సుభ్రతా దాస్, అజయ్ రాయ్ అనే ముగ్గురు స్నేహితులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోయారు. ఈ క్రమంలో తరచూ గంజాయి కొనుగోలు చేయడానికి వైకుంఠపూర్ అడవికి వెళ్లేవారు. ఇటీవల ఇలానే మత్తు పదార్థాల కోసం ముగ్గురు కలిసి అడవికి వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. గంజాయి సేవించిన తర్వాత తనకు ఇంకా పది రూపాయలు కావాలని రాంప్రసాద్ సుభ్రతా దాస్ ను అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని సుబ్రతా దాస్ చెప్పిన వినిపించుకోకుండా రాంప్రసాద్ తనతో గొడవ పడ్డాడు. ఈ గొడవ కాస్త పెరిగి కోపోద్రిక్తుడు అయిన సుబ్రతా దాస్ పక్కనే ఉన్న బండ రాయితో రాంప్రసాద్ తల మీద కొట్టి చంపేశాడు. తర్వాత సుబ్రతా దాస్, అజయ్ రాయ్ ఇద్దరు సంఘటన స్థలం నుండి పారిపోయారు. ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నేరస్తుడితో పాటు మరొక యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.