అమ్మాయిల హాస్టల్ 24 గంటలు ఓపెన్ ఉండాల్సిందే

గర్ల్స్ హాస్టల్స్ ను 24 గంటలు తెరచి ఉంచాలంట. అందుకోసం పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ నిరసనకు దిగారు. దీనిలో భాగంగా “బ్లాక్ దివాలీ”కి పిలుపునిచ్చారు సదరు విద్యార్థులు. ఈ నిరసనలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇరువురు పాల్గొన్నారు. 24 గంటలు గర్ల్స్ హాస్టల్ తెరచి ఉంచాలని వారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అసలు దీని వెనుక కారణమేంటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ గర్ల్స్ ఎప్పటి నుండో ఒక డిమాండ్ చేస్తున్నారు. 24 గంటలు బయటకు వెళ్లి వచ్చేలా అవకాశం కల్పించాలని వారి ప్రతిపాదన. తమ దెమంద్స్ తెలియాజేస్తూ మేనేజ్మెంట్ కి ఒక రిక్వెస్ట్ కూడా పంపారు. అయితే విద్యార్థులు చేసిన ఈ ప్రతిపాదనను మంగళవారం యాజమాన్యం రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ కొన్ని షరతులతో కూడిన ఒక వెసులుబాటును కల్పించింది. రాత్రి 9 నుండి 11 గంటల వరకు అమ్మాయిలు బయటకు వెళ్లి రావచ్చని చెప్పింది. అయితే బయటకు వెళ్ళేటపుడు, లోపలి వచ్చేటప్పుడు రిజిస్టర్ లో సంతకాలు పెట్టాలని షరతు పెట్టింది.

ఒకవేళ రాత్రి 11 గంటల తర్వాత ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన కారణాలు స్పష్టంగా తెలియాజేస్తూ మేనేజ్మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలని కండిషన్ పెట్టింది. కాగా ఈ నిబంధనలను తప్పుబడుతున్నారు విద్యార్థినులు. తమకు 24 అవర్స్ ఎంట్రీ ఉండాల్సిందేనని పట్టుబట్టారు. విద్యార్థుల డిమాండ్ ను తిరస్కరించిన మేనేజ్మెంట్ తీరు సిగ్గు చేటని, స్త్రీ పురుష బేధం ఇంకా కొనసాగుతుందని ఎస్ఎఫ్ఎస్‌ సభ్యురాలు హాసన్ ప్రీత్ అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే తమ ప్రతిపాదన అంగీకరించేంత వరకు నిరసన కొనసాగుతుందని పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ హెచ్చరిస్తున్నారు.