ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో మాంసాహారాన్ని నిషేధించాలని బిజెపి సభ్యులు కొందురు కోరుతున్నారు. అలాంటి వారిలో ఒకరైన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ప్రభుత్వ కార్యక్రమాలలో నాన్ వెజ్ ఆహారం నిషేధించాలని శుక్రవారంనాడు పార్లమెంటులో ఒక ప్రయివేట్ మెంబర్ బిల్లు ను ప్రవేశపెట్టారు.
చాలా ప్రయివేటు మెంబర్స్ బిల్స్ అడ్రసు లేకుండా పోతాయి. అయితే, ఇవి సభ్యుల మనోభావాలను వ్యక్తం చేస్తాయి. భారతీయజనతాపార్టీ లో కొందరు నేతలు ప్రజల ఆహారపుటలవాట్లను కూడా నియంత్రించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. గోమాంసంమీద వారి ధోరణి చాలా వివాదాలకు దారి తీసింది.
ఇపుడు దీనికి ఎక్స్ టెన్షన్ అన్నట్లు బిజెపి సభ్యుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో మాంసాహార వడ్డించడాన్ని నిషేధించాలని కోరుతున్నారు. పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ వెస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నిన్న Official Government Meetings and Functions (Prohibition on serving Non-Vegetarian Food) Bill, 2018 అనే శీర్షికతో బిల్లు ప్రవేశపెట్టారు.
