పెట్రోల్ ధర పెరగిందని పెట్రోల్ బంకును ఏం చేశారో చూడండి (వీడియో)

రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యుల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందని స్థాయిలో పెట్రోలు రేట్లు పెరగటంపై దేశమంతటా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరిస్సాలో పెట్రోలు ధర 100 దాటిందని, దీనితో ఒక్కసారిగా వాహనచోదకులు భగ్గుమన్నారని చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. దేశంలో పెట్రోలు ధర రు. 100 దాటిందా అని కనుగొనేందుకు ‘తెలుగు రాజ్యం’ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ధరలు పెరుగుతున్నా పెట్రోలు ధర ఎక్కడా 100 లేదని, భారత్ పెట్రోలియం డీలరొకరు హైదరాబాద్ లో చెప్పారు. ఈ వీడియో  లో పెట్రోలు బంకులపై దాడికి దిగడం కనిపిస్తుంది. పెట్రోలు బంకుల్లోని పరికరాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు.