హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. షాహిన్ నగర్, పహాడి షరిఫ్ ప్రాంతాలను ఎన్ఐఏ సెల్ తమ ఆధీనంలోకి తీసుకొని అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. గుజరాత్, జమ్ముకాశ్మీర్, మహారాష్ట్రలో ఉగ్రవాదుల కదలికలు బయటపడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే అబ్దుల్ అనే వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి నిమజ్జనాల సంధర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారంతో ఎన్ ఐఏ తనిఖీలు చేపట్టింది. రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని విమానాశ్రయాలలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు
