ఎయిర్టెల్ సంస్థ తమ వినియోగదారులకు శుభవార్త తెలియజేసింది. బండిల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ పేరుతో శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మొబైల్స్ పై మరో కొత్త ఆఫర్ ప్రకటించింది ఎయిర్టెల్. ఈ ఆఫర్ కింద తొలుత 7,900 రూ. డౌన్ పేమెంట్ చెల్లించి శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మొబైల్ పొందవచ్చని తెలిపింది. ప్రతినెలా ఈఎంఐ 2,999 రూపాయల చొప్పున 24 నెలలపాటు చెల్లించాలని పేర్కొంది.
రెండు సంవత్సరాల్లో ఈ మొబైల్ కోసం 79,876 రూ. చెల్లించాల్సి ఉంటుంది. అయితే బండిల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తీసుకున్న కస్టమర్లకు ప్రతి నెలా 100 జీబీ డేటా వినియోగించుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ ఇ-స్టోర్స్ లో ఆగష్టు 24 నుండి శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్స్ ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని శాంసంగ్ సంస్థ వెల్లడించింది.
