ముస్సూరి ఆరబోసిన అందాలు (గ్యాలరీ)

ముస్సూరి ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో, డెహ్రాడూన్ జిల్లాలో ఉండే అందమయిన పర్వత పట్టణం. హిమాలయాలకు సమీపాన ఉంటుంది. సముద్రమట్టానికి 1880 మీటర్ల ఎత్తున ఉంటుంది. నిజానికి ఈ పట్టణం పురాతనమైందేం కాదు. ఈస్టిండియా కంపెనీ అధికారి ఒకరు ఈ హిల్ స్టేషన్ ఏర్పాటుచేశారు. అదే ఇలాపెరిగిపెద్దదై ముస్సూరిగా ఎదిగింది. లెఫ్టినెంట్ ఫ్రెడెరిక్ యంగ్ అనే అధికారి ఇక్కడి వేటకొచ్చి, ఈ కొండట అందచందాలు చూసి ముగ్ధుడై  1823లో ఒక లాడ్జ్ కట్టుకున్నాడు. అక్కడ నుంచి ముస్సూరి యాత్ర  మొదలయింది. ఇపుడక్కడ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) ఉంది. అక్కడ అఖిల భారత సర్వీసులకు ఎంపికయిన వారికి శిక్షణ ఇస్తారు. ముస్సూరి పరిసరాల్లో ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఈ పోటోలు చూడండి…