ముంబై సెంట్రల్ రైల్వేలో రెండు మూడు రోజుల్లోనే వింత సంఘటనలు జరిగాయి. అవి కూడా మేక, పాముల వల్ల జరిగాయి. ఇదేంటి మేక పాముల వల్ల జరగడం అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి
ముంబైలోని సెంట్రల్ రైల్వే మార్గంలో టిట్వాల నుంచి సీఎస్ఎంటీ దిశగా వస్తున్న లోకల్ రైల్వేలో పాము కలకలం రేపింది. గురువారం ఉదయం 9.30 నిమిషాలకు టిట్వాలలో ప్రారంభమైన లోకల్ రైలు థానేకి సమీపంలో ఉండగా భోగిలో ఉన్న ఫ్యాన్ పై ఓ పచ్చని పాము కనిపించింది. దీంతో భయపడిపోయిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపేశారు. రైల్వే సిబ్బంది పామును రైలు నుంచి బయటికి పంపించారు. రైలు నిలిచి పోవడంతో పలు రైళ్లన్ని ఆలస్యంగా నడిచాయి.
ఇదిలా ఉంటే మంగళవారం నాడు మసీద్ స్టేషన్ లో ఓ వ్యక్తి టిక్కెట్ లేకుండా లోకల్ రైలులో ప్రయాణిస్తున్నాడు. అది గమనించిన టిసి అతన్ని జంతువులతో కలిసి ప్రయాణించడం నిబంధనలకు విరుద్దం ముందు టిక్కెట్ చూపించమని అడిగాడు. సదరు ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడని తేలింది. దాంతో టీసీ అతనికి ఫైన్ విధించాడు. కానీ ఫైన్ కట్టాల్సిందేనని టీసీ చెప్పడంతో నా మేకను మీ దగ్గర ఉండనివ్వండి నేను వెళ్లి పైసలు తీసుకొస్తానని వెళ్లాడు. అలా వెళ్లిన మనిషి మళ్లీ ఇంత వరకు తిరిగిరాలేదు. దాంతో రైల్వే సిబ్బంది ఆ మేకను కట్టేసి జాగ్రత్తగా చూసుకున్నారు. అంతే కాక మేకకు బసంతి అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఎన్ని రోజులు ఇలా అని అనుకున్నారు. నిబంధనల ప్రకారం లైవ్ స్టాక్ ను వేలం వేయాల్సిందే. అందుకే చివరకు మేకను వేలం వేయాలని బసంతి ఖరీదును 3000 రూపాయలుగా నిర్ణయించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో 500 తగ్గించి 2500 రూపాయలకు ఓ వ్యక్తి కి అమ్మారు. ముంబై లోకల్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే 256 రూపాయలు ఫైన్ ను విధిస్తారు. కానీ బసంతిని వేలం వేయడం ద్వారా పదివేల రూపాయల లాభం రావడం విశేషం.
