రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారా లేక ప్రియాంక ని నిలబెడతారా? ఈ విషయం మీద అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా కన్ ఫ్యూజన్ లో ఉంటే, వారణాశిలో ప్రియాంక నిలబడాలనే డిమాండ్ మొదలయింది.
అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ మీద ప్రియాంకయే నిలబడాలని కోరుతూ పోస్టర్లు పట్టుకుని వీధుల్లో హంగామా సృష్టిస్తున్నారు. వారణాశి కూడా తూర్ప ఉత్తర ప్రదేశ్ లోనే ఉంటుంది. ఆమె తూర్పు యుపి కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రధాన కార్యదర్శి.
అమేధీ, రాయ్ బరేలీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసే రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద పొటీ పెట్టరాదని సమాజ్ వాది పార్టీ, బహుసమాజ్ వాది పార్టీలు నిర్ణయించాయి.
వారిరువురు రాష్ట్రమంతా తిరిగి పార్టీ తరఫున క్యాంపెయిన్ చేసేందుకు వీలుండాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖిలేష్ యాదవ్, మాయావతి ప్రకటించారు. వారిరువురు తమ నియోజకవర్గాల్లో కూరుకుపోకుండా ఉండరాని, బిజెపికి వ్యతిరేకండా వారు కూడా ప్రచారం చేయాలని, దీనికి ఇది అవసరమని వారు చెప్పారు.
అక్కడ ప్రియాంకపోటీ చేసినా ఇదే నియమం వర్తిస్తుంది. అయితే, ఇపుడు వారణాశిలో ప్రియాంక పోటీచేయాలనే డిమాండ్ వస్తున్నది.
ఈ మేరకు అక్కడి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పోస్టర్ ఉద్యమం కూడా మొదలు పెట్టారు.రాహుల్ గాంధీ, అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ , ప్రియాంక బొమ్మలతో ఈ పోస్టర్లు వెలిశాయి.
ఈ పోస్టర్లలో రెండు నినాదాలు ఉన్నాయి. “Kashi Ki Janta Kare Pukar, Priyanka Gandhi Ho Sansad Hamaar’ (ప్రియాంక కాశీ లోక్ సభ సభ్యులు కావాలని కాశీ ప్రజల డిమాండ్.) ‘We want Priyanka’ (ప్రియాంక కావాలి).
పోస్టర్లు వేసిన అజయ్ రాయ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మోదీ మీద పోటీ చేశారు. వారణాశిలో రెండో స్థానం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు వచ్చిన, అజయ్ రాయ్ కు 75 వేల ఓట్లు వచ్చాయి. ఇది ఎస్ సి, బిఎస్ పిలకు పడిన మొత్తం ఓట్ల కంటే ఎక్కువ.
వారణాశిలో కాంగ్రెస్ కు మంచిపునాది ఉంది, అందువల్ల ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసి మోదీ ని గుజరాత్ కు పంపించాలని కాంగ్రెస్ నేతలంటున్నారు.
