లోక్ సభ ఎన్నికలకు కమల్ హాసన్ రెడీ

సినీ నటుడు,కమల్ హాసన్ నెలల తరబడి సాగుతున్న పొలిటిటకల్ సస్పెన్స్ క్లియర్ చేశారు.

తన పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తాను కూడా పోటీ చేస్తానని ప్రకటించారు.

తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలతో పాటు పాండిచ్చేరి లోక్‌సభ స్థానంలో కూడా తమ పార్టీ పోటీ చేయాలని నిర్ణయంచినట్లు చెప్పారు.

అయితే, రాష్ట్రంలో ని ప్రధాన పార్టీలయిన డిఎంకె, ఎఐ డిఎంకె పార్టీ లతో ఎలాంటి పొత్తు ఉండదని కూడా స్పష్టం చేశారు.

ఎందుకంటే, వాళ్లతో కలసి మా చేతుల్ని కంపు చేసుకోలేమని ఆయన అన్నారు.
కమల్ పార్టీ ఎన్నికలలో దిగడం ఇదే మొదటి సారి. అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది కమల్ హాసన్ వెల్లడించలేదు.