బళ్లారి మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకెళ్లారు. అంబిండెట్ కంపెనీని ఈడి విచారణ నుంచి తప్పిస్తానని చెప్పి సదరు కంపెనీ నుంచి గాలి భారీ మొత్తంలో అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈడి అధికారికి గాలి జనార్ధన్ రెడ్డి కోటి రూపాయల లంచం ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. అంబిడెట్ కంపెనీ నుంచి గాలి జనార్దన్ రెడ్డి 57 కిలోల బంగారు కడ్డీలు తీసుకున్నాడని తెలుస్తోంది.
ఈడి అధికారికి కోటి రూపాయల లంచం ఇచ్చినా కూడా పథకం వర్కవుట్ కాకపోవడంతో అంబిడెట్ కంపెనీ అసలు విషయాలు విచారణాధికారులకు తెలిపింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డిని విచారించేందుకు బుధవారం ఉదయం అధికారులు అతని ఇంటికి వెళ్లగా జనార్దన్ రెడ్డి అప్పటికే పరార్ అయ్యారు. అధికారులు గాలి జనార్దన్ రెడ్డి కోసం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాలలో వెతుకుతున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి మిత్రుల ఇళ్లతో పాటు గాలికి సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలలో అధికారులు సెర్చ్ చేస్తున్నారు. విచారణ నిమిత్తం వస్తే గాలి పరారీ కావడంతో అధికారుల అనుమానాలకు బలం చేకూర్చాయి. బెంగుళూరుతో పాటు హైదరాబాద్ లో కూడా గాలి అజ్ఞాత వార్త సంచలనంగా మారింది.
