మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని పచోరా తాలూకా పుంగావ్కు చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ మే 5న కలాంసర గ్రామానికి చెందిన యామినితో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఎంతో ఆనందంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్న జంటకు, మూడు రోజుల్లోనే కఠినమైన అనుభవం ఎదురయ్యింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జవాన్ పాటిల్కు ఆర్మీ నుంచి అత్యవసర పిలుపు వచ్చింది.
వివాహం అయిన మూడో రోజే విధులకు పిలుపు రావడం అంటే ఆ జంటకు ఎంతలా ఎమోషనల్ అవుతుందో ఊహించగలం. కానీ, దేశం ముందు అన్నీ తక్కువే. జవాన్ విధులకు బయలుదేరే సమయంలో అతన్ని ఆపాలని భార్యకు చిన్న ఆలోచన కూడా రాలేదు. ‘‘నా సిందూరాన్ని దేశ రక్షణకు పంపిస్తున్నా’’ అంటూ యామిని గర్వంగా చెప్పిన మాటలు స్థానికులనే కాకుండా సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరిని కదిలించాయి. ఈ దృశ్యాలు కాసేపు అందరి మనసులను వత్తిళ్లకు లోనుచేశాయి.
पाचोरा तालुक्यातील खेडगाव नंदीचे गावातील जवान मनोज पाटील यांचा ५ मे रोजी विवाह झाला होता. परंतु, लगेचच त्यांना देशाच्या सीमेवर सेवा पुन्हा सुरू करण्याचे आदेश मिळाले. विवाहानंतर तात्काळ पत्नीला विश्वास देऊन ते देशाची सेवा करण्यासाठी सीमेवर रवाना झाले. 1/3 pic.twitter.com/aeKb69ypk1
— Lok Shevay (@LokShevay) May 9, 2025
వీటిపై స్పందిస్తున్న నెటిజన్లు, ‘‘ఇది నిజమైన దేశభక్తి’’ అని ప్రశంసిస్తుండగా, మరికొందరు ‘‘జవాన్ల వ్యక్తిగత జీవితాలకూ సమాన ప్రాధాన్యం ఉండాలి’’ అంటూ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఎందుకంటే ఒక జవాన్ వెనుక అతని కుటుంబం ఉంది. ఆ కుటుంబం ప్రతి రోజు ఆత్మస్థైర్యంతో నిలబడాలి అంటే సమాజం, ప్రభుత్వం నుంచి వారికి మద్దతు లభించాలి.
ఇలాంటి సందర్భాలు మనకు గుర్తుచేస్తాయి.. జవాన్లు కేవలం యుద్ధరంగంలో పోరాడే వీరులే కాదు; వారి భార్యలు, కుటుంబాలు కూడా అంతే ధైర్యాన్ని చూపుతున్నారు. ఈ ధైర్యం, త్యాగం కేవలం పాటిలే కాదు, వేలాది జవాన్ల కుటుంబాల్లో ప్రతీ రోజు చోటుచేసుకుంటున్న గొప్ప ఉదాహరణలు.