ఇంగ్లాడ్ తో మొదటి టెస్టులో తలపడుతున్న భారత్ ఓటమి అంచులో ఉంది. భారత్ ను గెలిపించేందుకు టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరిగా పోరాడాడు. ఓ వైపు ఆతిథ్య బౌలర్లు వికెట్లు తీస్తున్నా ఒత్తిడికి గురికాకుండా అర్ధశతకం పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే బెన్ స్టోక్స్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికి పోయాడు. రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. విజయానికి ఇంకా 52 పరుగుల అవసరం ఉంది. విరాట్ ఔట్ తో భారత్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 52 పరుగుల దూరంలో ఉంది.