మెరీనా అన్నా స్క్వేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. తీవ్ర వాదోపవాదనల మధ్య హైకోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ న్యాయవాది, డిఎంకే న్యాయవాది మధ్య వాడీ వేడిగా వాదనలు సాగాయి. గతంలో జానకీ రామచంద్రన్ అంత్యక్రియలు నిర్వహించడానికి డిఎంకే ప్రభుత్వం అనుమతివ్వలేదని ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేశారు. ఈ రిట్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ అవసరం లేదనడంతో న్యాయమూర్తి వారం పాటు వాయిదా వేద్దామా అని వ్యంగ్యంగా అన్నారు. రాత్రికి రాత్రే మేనేజ్ చేసి ఐదు కేసులు ఉపసంహరించుకునేలా చేశారని ప్రభుత్వం అనడంపై డిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవిడ నేతల పక్కనే అంత్యక్రియలు నిర్వహించాలని డిఎంకే పట్టుబట్టింది. మొత్తానికి యుద్ద వాతావరణంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. మెరీనా బీచ్ లో సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో డిఎంకే కార్యకర్తుల కన్నీటితో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కరుణానిధి అంత్యక్రియలపై మద్రాస్ హైకోర్టు తీర్పు
