2019 లోక్ సభ ఎన్నికల 5వ దశకు పోలింగ్ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ రోజు వోటు హక్కు వినియోగించుకోవలసి ఉంది.
ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 51 నియోజకవర్గాల నుంచి 674 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 12% మంది మహిళలున్నారు. ఈ పోలింగ్ మిగతా అన్ని పార్టీలకంటే భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి చాలా ప్రతిష్టాత్మకమయినది.ఎందుకంటే, పోలింగ్ కు పోతున్న 51 నియోకవర్గాలలో 2014 ఎన్నికల్ల మోదీ హవా ఉండింది. బిజెపి అపుడు 39 స్థానాలను గెల్చుకుంది. ఇపుడు మెజారిటీ స్థానాలను గెల్చుకోవడం కాదు, ఉన్న స్థానాలను నిలపుకోవాలి. ఇది చాలా కష్టమని ఎన్నికల పండితులు చెబుతున్నారు.
ఈ దశ పోలింగ్ లోని మోదీ మరీ తీవ్రంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. పోలింగ్ కు ఒక రోజుముందు మరీ తీవ్రంగా విజృంభించి, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ అవినీతిలో నెంబర్ వన్ అనే పేరుతో చనిపోయాడని అన్నారు.రాజీవ్ గాంధీ రాజకీయాలను మిస్టర్ క్లీన్ ప్రారంభించి, అవినీతిలో నెంబర్ వన్ గా చనిపోయాడని చెప్పారు. దీనికి రాహుల్ గాంధీ ధీటుస్పందించి, ఆట ముగిసింది, ఇక మోదీ కర్మ మిగిలింది అన్నారు.
ఒకప్రధాని ఇంత తీవ్రంగా ప్రతిపక్షనేత మీద దాడికి దిగడం గతంలో ఎపుడూ జరగలేదు. ఈ దాడి మెుత్తం అయిదో దశలోని 39 స్థానాలను కాపాడుకునేందుకే నని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదిసాధ్యం కాదని సిపిఎంనేత ఏచూరి సీతారాం కూడా చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో బిజెపి రాజస్థాన్ లొ 12, యుపిలో 12, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్ లో అయిదు,జమ్ము కాశ్మీర్ లో లధాక్ ను గెల్చుకుంది. ఈ సారి ఎన్నికల నాటికి రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో బిజెపి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి.యుపి లో బిజెపి బిఎస్ పి, సమాజ్ వాది పార్టీ, ఐఎన్ ఎల్ డిల బలమయిన కూటమితో తలపడాల్సి వస్తున్నది.
ఇక కాంగ్రెస్కు సంబంధించి ఈ పార్టీ గతంలో అమేధీ, రాయ్ బరేలీలలో మాత్రమే గెల్చింది. కాంగ్రెైస్ కాపాడుకోవలసింది ఈ రెండింటినే.
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి మూడో దశ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈనియోజకవర్గంలో మూడు దశ పోలింగ్ నిర్ణయించారు. ఈ రోజు పుల్వామా జిల్లాలో పోలింగ్ జరుగుతుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, యుపిఎ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ వంటి ప్రముఖుల నియోజకవర్గాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగుతున్నది.
కేంద్ర సహాయ మంత్రులు అర్జున్రామ్ మేఘ్వాల్, జయంత్సిన్హా, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా లతో పాటు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, మాజీ ఒలింపిక్ క్రీడాకారులు రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ పోటీచేస్తున్న నియోజకవర్గాలలో కూడా ఈ రోజే పోలింగ్ జరుగుతున్నది.
సోమవారం పోలింగ్తో మొత్తం 424 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగుస్తుంది. మిగిలిన 118 స్థానాలకు ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది.
ఈ రోజు పోలింగ్కు పోతున్న అభ్యర్తులలో 184 మంది అంటే 27.5శాతం మంది కోటీశ్వరులున్నారు. 348 మంది అంటే 52.1 శాతం గ్రాజుయేట్ , ఆపై ఉన్నత విద్యావంతులున్నారు. పోటీల 79 (11.8) మంది మహిళలున్నారు.
