ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా, ఆయన నాయకత్వంలోని భారతీయ పార్టీ నిర్భయంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct)ని ఉల్లంఘించడం పట్ల దేశంలో అనేక బాధ్యతాయుతల పదవీ బాధ్యతలను నిర్వర్తించి రిటైరైన పలువురు సివిల్ సర్వీస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు, ఎన్నికల నియమావళిని యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా ఏమి చేయలేని బీరువులాగా ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్రవహిస్తూ ఉండటం పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషన్ కు ఉన్న నిష్పాక్షికత, స్వయం ప్రతిపత్తి మంట గలిసిపోతున్నాయని చెబుతూ 66 మంది మాజీ సీనియర్ అధికారులు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వాటి పట్ల ఎన్నికల కమిషన్ తీరుకు సాక్షంగా వారు 9 ఉదాహరణలు కూడా పొందుపరిచారు.
ఎన్నికల కమిషన్ కు ఉన్నస్వతంత్ర స్వభావం, న్యాయ గుణం, నిష్పాక్షికత,కార్యదక్షత (Independence,Fairness,Impartiality and Efficiency) ఇటీవల అమ్ముడు పోయాయని వారు చెప్పారు.
వారు రాష్ట్రపతి ముందుంచిన సాక్ష్యాలలో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం మీద ప్రధాని దేశప్రజలకు చేసిన ప్రసంగం,ప్రధాని మీద వస్తున్న బయోపిక్, నమో టివి, ఇతర బిజెపి నాయకులు చేస్తున్న భావోద్వేగ ప్రసంగాలు ఉన్నాయి.
ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వంటి ప్రభుత్వ ఘన విజయాలను ప్రధాని తన ఖాతాలో వేసుకోవడం ప్రమాదకరమని వారు పేర్కొన్నారు.
“Parading the achievements of a government in this manner after the announcement of elections is tantamount to a serious breach of propriety and amounts to giving unfair publicity to the party presently in government and that the ECI’s decision does not stand up to the standards of impartiality expected of it.”
ప్రధాని బయోపిక్ ను అనుమతించడమంటే ఉచితంగా దొడ్డి దారిన పబ్లిసిటి కొట్టేసేందుకు ప్రధానికి, ఆయన నాయకత్వంలోని పార్టీకి అనుమతినీయడమేనని వారు ఆక్షేపణ తెలిపారు.
“This represents a backdoor effort to garner free publicity for a political person (and his party). In the event that this biopic is released even while the election process is ongoing, we contend that the entire expenses on the production, distribution and publicity of the biopic should be debited to the election expenses of Shri Narendra Modi,”అని వారు 8 పేజీల లేఖలో పేర్కొన్నారు.
‘Modi: A common man’s journey’ (మోదీ: ఒక సగటు మనిషి జీవనయాత్ర ) పేరుతో వెబ్ సిరీస్ చూపించడం, నమో టివి ని ప్రారంభించడంకూడా ఈ బాపతేనని వారు పేర్కొన్నారు.
“We are deeply concerned about the weak-kneed conduct of of ECI,which has reduced th credibility of this costitutional body to an all-timelow,” అని వారు లేఖలోపేర్కొన్నారు.
లేఖ మీద సంతకాలు చేసిన వారిలో మాజీ ఐపిఎస్ అధికారి జూలియో రెబీరో,మాజీ విదేశాంగ కార్యదర్శి శివ్ శంకర్ మేనాన్, మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ట్రాయ్ చెయిర్మన్ రాహుల్ ఖుల్లడ్, మాజీ వైద్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు, మాజీ ప్రసారభారతి చెయిర్మన్ జవహర్ సర్కార్ , మాజీ ఐపిఎస్ అధికారి మీరన్ బోర్వాంకర్ లు ఉన్నారు.
ఎన్నికల కమిషన్ చర్యల వల్ల భారత ప్రజాస్వామ్యానికి పునాది వంటి న్యాయమయిన ఎన్నికల విధానం ప్రమాదంలో పడుతూ ఉందని వారు పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళిని కేంద్రంలో ఉన్న అధికారపార్టీ తుంగలో తొక్కేయడం, దానిని ఏమీ అనలేని స్థితిలో ఎన్నికల కమిషన్ ఉండటం తమని బాధిస్తూ ఉందని వారు పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని అర్టికిల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ ను పనిచేసేలా చేయాల్సింది వారు రాష్ట్రపతిని కోరారు.
