మ్యాట్రిమోనీలో ఫోటోలు పెట్టే వారికి షాకింగ్ న్యూస్

ఢిల్లీలో జరిగిన ఒక యదార్థ సంఘటన సంచలనం రేపింది. ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న యువతి ఫోటో ఆమె ప్రమేయం లేకుండానే పోర్న్ వెబ్సైటులో ప్రత్యక్షమయింది. ఎవరు పెట్టారా అని ఆరా తీస్తే ఆమెకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలిసింది.

వసంత్ కుంజ్ గ్రామానికి చెందిన యువతికి మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తుంటాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఎంగేజ్ మెంట్ కుదుర్చుకున్నారు. ఈమధ్యలోనే అమ్మాయి, అబ్బాయికి పరిచయం పెరిగింది. ఇద్దరూ రోజూ ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. సడన్ గా ఒకరోజు అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్. ఎన్ని సార్లు ట్రై చేసినా నెంబర్ కలవట్లేదు. ఆమె అతన్ని కలవటానికి ట్రై చేసినా దొరకలేదు. ఇంక అతన్ని లైట్ తీసుకుంది ఆ అమ్మాయి.

కానీ కొద్ది రోజులకి తెలియని నంబర్ల నుండి ఆమెకు ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ఫోన్ చేసిన వ్యక్తులు నాతో డేటింగ్ కి వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక విషయం ఏంటో ఆరా తీయగా ఆమెకు దిమ్మ తిరిగినట్లైంది. తన ప్రొఫైల్ ఫోటో ఒక పోర్న్ వెబ్సైటులో కనిపించింది. వెంటనే ఈ విషయాన్నీ పేరెంట్స్ కి చెప్పి, పోలీసు కంప్లైంట్ ఇచ్చింది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేశారు పోలీసులు. ఆమె ఫోటో పోర్న్ వెబ్సైటులో పెట్టింది ఎవరో కాదు. తనకి మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై ఎంగేజ్ మెంట్ కి రెడీ అయి, చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న యువకుడే. అరెస్టు చేసిన పోలీసుల ముందు నేనే ఈ పని చేశాను అని నిజం ఒప్పుకున్నాడు. ఎందుకిలా చేశావ్ అని పోలీసులు అతన్ని ప్రశ్నించగా…సమ్మెను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని, తనతో డేటింగ్ మాత్రమే చేయాలి అనుకున్నాను. ఈ విషయం తనకి కూడా చెప్పాను కానీ ఆమె ఒప్పుకోలేదు. అందుకే కోపంతో ఈ పని చేశాను అని పోలీసులతో చెప్పాడట.